Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 01, 2026 07:54 PM

ముస్లిం భాయ్ బహేన్ కే లియే సీఎం రేవంత్ రెడ్డి క తోఫా తయ్యార్ హై

ముస్లిం భాయ్ బహేన్ కే లియే సీఎం రేవంత్ రెడ్డి క తోఫా తయ్యార్ హై

ముస్లిం భాయ్ బహేన్ కే లియే సీఎం రేవంత్ రెడ్డి క తోఫా తయ్యార్ హై
March 01, 2026 06:01 PM 3 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

పవిత్ర,రంజాన్ మాసం నడుస్తున్న,సందర్బంగ రాష్ట్రంలోని,ముస్లిం మైనారిటీ లకు,రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంజాన్ క తోఫా పంపించారని యాదాద్రి భువనగిరి జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారిని జయమ్మ తెలిపారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ... ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడ ముస్లిం మైనారిటీ లకు పవిత్ర,రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు పూర్తి చేసుకొని,సంతోషంగా

రంజాన్ పండుగను జరుపుకో వాలనే ఉద్దేశంతో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి రంజాన్ తోఫా పంపించారని అన్నారు. ఇందులో కుర్తా పైజమా సారి ఒక సూట్ ఉంటుందని అన్నారు.అదే విధంగా,ఇఫ్తార్ పార్టీ నిర్వహించడానికి తేదీని ప్రకటిస్తామని తెలిపారు అలాగే భువనగిరి నియోజక వర్గానికి మూడు లక్షలు,ఆలేరు నియోజకవర్గానికి రెండు లక్షలు రూపాయలు మంజూరు అయ్యాయని తెలిపారు.జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు త్వరలో మీటింగ్ ఏర్పాటు చేసి రంజాన్ తోఫాలను మసీద్ కమిటీ అధ్యక్షులకు అందజేస్తా మని,మసీద్ కమిటీ వారు,తమ వార్డుల్లో ఉన్న నిరుపేదలకు అందించాలని సూచించారు.అందరు సంతోషంగా పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు.ఇతర వివరాలకు జూనియర్ అసిస్టెంట్ మజీద్ ను సంప్రదించాలని కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News