ముస్లీం సోదరులకు ఇఫ్తార్ విందు
ముస్లీం సోదరులకు ఇఫ్తార్ విందు
Sthanikam District Staff Reporter
ముస్లీం సోదరులకు ఇఫ్తార్ విందు నిర్వహించిన గ్రామ సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్
భువనగిరి మండల పరిదిలోని తాజ్పూర్ గ్రామంలో రంజాన్ పండుగ సందర్భంగా ముస్లీం సోదరులు తాజ్పూర్ గ్రామ సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ ర్యాకల శ్రీనివాస్ మాట్లాడుతూ ముస్లీం మైనారిటీ సోదరి సోదరమనులకు రమజాన్ ఉపవాసాల మాస శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రంజాన్ పండుగ అంటే 30 రోజులపాటు ఉపవాసాలతో అల్లా దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని ఎంతో పవిత్రతో ఉపవాసాలు ఉండడం జరుగుతుంది అని తెలిపారు. గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ మాజీ శాసనసభ్యులు పైళ్ళ శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ముస్లీం మైనారిటీ సబ్యులకు ప్రభుత్వం ద్వారా రంజాన్ కిట్లు పంపిణీ చేయడం జరిగేది ముస్లీం సోదరులకు కూడా ఎంతో ఆనంద పడేవాల్లు. కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇవేమీ లేవని పొద్దున లేస్తే ఏ ఇల్లు కుల్చేదమ ఏ అపార్ట్మెంట్ కుల్చేధమ అనే కాలయాపన చేస్తూ... వైఫల్యం చేదిందని తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో తాజ్పుర్ గ్రామ సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్, బిఅర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు జనగాం పాండు,కార్యదర్శి ఓంప్రకాష్ గౌడ్,మాజీ ఎంపీపీ కేశవపట్నం రమేష్,ఎస్.కే.అహ్మెద్,యాకూబ్,గ్రామ పాలకవర్గం,గ్రామ యూత్ సభ్యులు,ముస్లీం మైనారిటీ సోదరులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి