Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 05:29 PM

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధిక్యం – నేడు పట్టణంలో భారీ ప్రదర్శన

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధిక్యం – నేడు పట్టణంలో భారీ ప్రదర్శన

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధిక్యం – నేడు పట్టణంలో భారీ ప్రదర్శన
February 16, 2026 08:30 AM 253 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నారాయణఖేడ్ పట్టణ కేంద్రంలో ఈ రోజు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల అనంతరం విజయోత్సవ ర్యాలీ ఘనంగా నిర్వహించనున్నట్లు పార్టీ సోషల్ మీడియా ఇన్చార్జి నందు శేరికార్ ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.ఇటీవల నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల్లో స్థానిక మున్సిపాలిటీ పరిధిలోని 15 వార్డుల్లో 11 వార్డులను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఘనవిజయం సాధించడం విశేషం. ప్రజలు పార్టీపై ఉంచిన విశ్వాసానికి కృతజ్ఞతగా ఈ విజయోత్సవ ర్యాలీని నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.ఇటీవల నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల్లో స్థానిక మున్సిపాలిటీ పరిధిలోని 15 వార్డుల్లో 11 వార్డులను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఘనవిజయం సాధించడం విశేషం. ప్రజలు పార్టీపై ఉంచిన విశ్వాసానికి కృతజ్ఞతగా ఈ విజయోత్సవ ర్యాలీని నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, ఎమ్మెల్యే పి. సంజీవరెడ్డి, రాష్ట్ర నాయకులు పి. చంద్రశేఖర్ రెడ్డి, పీసీసీ సభ్యులు కే. శ్రీనివాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాకేష్ షేట్కార్, యువత నాయకులు సాగర్ షేట్కార్ తదితరులు పాల్గొననున్నారు.మున్సిపల్ కార్యాలయం నుంచి ప్రారంభమయ్యే ఈ ర్యాలీ పట్టణంలోని ప్రధాన పురవీధుల గుండా సాగనుంది. ప్రజల ఆశయాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లే సంకల్పంతో ఈ విజయోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు నాయకులు తెలిపారు.పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయోత్సవ ర్యాలీని విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం విజ్ఞప్తి చేసింది.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News