Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాళేశ్వరం పై కక్షసాధింపుకు బ్రేక్ – హైకోర్టు స్టేతో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ పత్తికుంటపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 25, 2026 04:11 AM

మేరు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా టైలర్స్ డే వేడుకలు

మేరు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా టైలర్స్ డే వేడుకలు

మేరు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా టైలర్స్ డే వేడుకలు
February 28, 2026 10:58 PM 12 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

మేరు కుల అభివృద్ధి, సంక్షేమానికి తన వంతు కృషి చేస్తాం...

మేరు కుల సంఘ భవన నిర్మాణానికి రూ.12 లక్షల నిధులు కేటాయిస్తాం..

-ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

భువనగిరి టౌన్:మేరు కుల అభివృద్ధి, సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని కుంభం అనిల్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. భువనగిరి పట్టణంలోని మేరు సంఘ భవనంలో నిర్వహించిన టైలర్స్ డే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...ప్రపంచానికి నాగరికతను నేర్పింది దర్జీలేనని పేర్కొన్నారు. ప్రస్తుతం పుట్టగొడుగుల్లా పెరుగుతున్న రెడీమేడ్ వ్యవస్థ కారణంగా మేరు కులస్తులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి అభ్యున్నతికి ప్రజా ప్రభుత్వం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాల్లో జీరో అవర్‌లో మేరు కులస్తుల జీవన స్థితిగతులపై ప్రస్తావించి, వారి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు. కులస్తుల హక్కుల సాధనకు తన వంతు సహకారం అందిస్తానని పేర్కొన్నారు.

భువనగిరి పట్టణ మేరు కుల సంఘ భవన నిర్మాణానికి రూ.12 లక్షల నిధులు కేటాయిస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ తంగళ్లపల్లి శ్రీవాణి రవికుమార్,మేరు సంఘం పట్టణ అధ్యక్షులు కీర్తి సత్యనారాయణ,బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కొత్త నరసింహస్వామి, గౌరవ అధ్యక్షులు తాళ్ల భాస్కర్, కాటారం భాస్కర్,మేడిగా జగదీష్, మొలుగూరి గౌరీశంకర్,రేణిగుంట్ల విట్టల్,తాళ్ల కిరణ్ కుమార్,కొత్త సత్యం, బాలరాజ్,దోమకొండ సత్యనారాయణ, లవణం ఉపేందర్,కౌన్సిలర్లు జంగయ్య, శివ,అమర్,సర్పంచ్ ఎడ్ల వెంకటరెడ్డి, ఫకీర్ కొండల్ రెడ్డి,మంగ ప్రవీణ్,మేరు కుల సంఘం మహిళలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News