Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఏబీవీపీ ఆధ్వర్యంలో చౌటుప్పల్‌లో విద్యాసంస్థల బంద్ సక్సెస్! కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 24, 2026 10:06 AM

మేరు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా టైలర్స్ డే వేడుకలు

మేరు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా టైలర్స్ డే వేడుకలు

మేరు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా టైలర్స్ డే వేడుకలు
February 28, 2026 10:58 PM 18 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

మేరు కుల అభివృద్ధి, సంక్షేమానికి తన వంతు కృషి చేస్తాం...

మేరు కుల సంఘ భవన నిర్మాణానికి రూ.12 లక్షల నిధులు కేటాయిస్తాం..

-ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

భువనగిరి టౌన్:మేరు కుల అభివృద్ధి, సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని కుంభం అనిల్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. భువనగిరి పట్టణంలోని మేరు సంఘ భవనంలో నిర్వహించిన టైలర్స్ డే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...ప్రపంచానికి నాగరికతను నేర్పింది దర్జీలేనని పేర్కొన్నారు. ప్రస్తుతం పుట్టగొడుగుల్లా పెరుగుతున్న రెడీమేడ్ వ్యవస్థ కారణంగా మేరు కులస్తులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి అభ్యున్నతికి ప్రజా ప్రభుత్వం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాల్లో జీరో అవర్‌లో మేరు కులస్తుల జీవన స్థితిగతులపై ప్రస్తావించి, వారి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు. కులస్తుల హక్కుల సాధనకు తన వంతు సహకారం అందిస్తానని పేర్కొన్నారు.

భువనగిరి పట్టణ మేరు కుల సంఘ భవన నిర్మాణానికి రూ.12 లక్షల నిధులు కేటాయిస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ తంగళ్లపల్లి శ్రీవాణి రవికుమార్,మేరు సంఘం పట్టణ అధ్యక్షులు కీర్తి సత్యనారాయణ,బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కొత్త నరసింహస్వామి, గౌరవ అధ్యక్షులు తాళ్ల భాస్కర్, కాటారం భాస్కర్,మేడిగా జగదీష్, మొలుగూరి గౌరీశంకర్,రేణిగుంట్ల విట్టల్,తాళ్ల కిరణ్ కుమార్,కొత్త సత్యం, బాలరాజ్,దోమకొండ సత్యనారాయణ, లవణం ఉపేందర్,కౌన్సిలర్లు జంగయ్య, శివ,అమర్,సర్పంచ్ ఎడ్ల వెంకటరెడ్డి, ఫకీర్ కొండల్ రెడ్డి,మంగ ప్రవీణ్,మేరు కుల సంఘం మహిళలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News