మార్నింగ్ వాక్లో పార్క్ అభివృద్ధి పనుల పరిశీలన:ఖేఢ్ ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి
మార్నింగ్ వాక్లో పార్క్ అభివృద్ధి పనుల పరిశీలన:ఖేఢ్ ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి
Krishna
నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలో పట్టణ ప్రజల కోసం నిర్మిస్తున్న అర్బన్ ఫారెస్ట్ పార్క్ పనులను స్థానిక శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి మార్నింగ్ వాక్ కార్యక్రమంలో భాగంగా సందర్శించి సమీక్షించారు. పార్కు ప్రాంతమంతా తిరిగి జరుగుతున్న పనుల పురోగతిని తెలుసుకుంటూ, సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరుగుతున్న కాలుష్య పరిస్థితుల్లో ప్రజలకు స్వచ్ఛమైన గాలి, ప్రశాంత వాతావరణం అందించాలనే లక్ష్యంతో ఈ పార్క్ను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. పట్టణ ప్రజలు ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఉదయం, సాయంత్రం వేళల్లో వ్యాయామం చేయడానికి, సేదతీరడానికి ఈ పార్క్ ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.పార్కులో వాకింగ్ ట్రాక్లు, పిల్లల ఆట స్థలాలు, విభిన్న రకాల మొక్కల నాటడం వంటి పనులను వేగవంతంగా పూర్తి చేసి నిర్ణీత గడువులో అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తున్న ఈ పార్క్ పర్యావరణ పరిరక్షణకు తోడ్పడటమే కాకుండా పట్టణానికి కొత్త అందాన్ని తీసుకువస్తుందని, పట్టణ ప్రజలతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు కూడా కుటుంబ సభ్యులతో కలిసి గడపడానికి అనువైన ప్రదేశంగా మారుతుందని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో పండరి రెడ్డి, రామచందర్ మాజీ ఎంపీటీసీలు, బాణాపురం రాజు, రుక్మిణి గోపాల్ రెడ్డి, షారుఖాన్, మహేష్ చౌహన్, సుబుర్, మున్సిపల్ కౌన్సిలర్లు, గంగారెడ్డి, సంగ్రామ్, మహేందర్ నాయక్ తదితర స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు పట్టణ ప్రజలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి