Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నిజాయితీకి నిదర్శనం సెక్యూరిటీ సిబ్బంది మరిచిపోయిన మొబైల్‌ను భక్తునికి అప్పగింపు ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ “అంధకారంలో వెలుగైన మహనీయుడు: అంబేద్కర్ చూపిన సమానత్వ దారి” – డి.డి. దాస్ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం.. కోర్టుల కంటే మీరే ఎక్కువా..? సన్‌రైజర్స్ 'ఉపేషారు'.. కుర్రాళ్ల దెబ్బకు రాజస్థాన్ విలవిల! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 16, 2026 06:33 PM

మార్నింగ్ వాక్‌లో పార్క్ అభివృద్ధి పనుల పరిశీలన:ఖేఢ్ ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి

మార్నింగ్ వాక్‌లో పార్క్ అభివృద్ధి పనుల పరిశీలన:ఖేఢ్ ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి

మార్నింగ్ వాక్‌లో పార్క్ అభివృద్ధి పనుల పరిశీలన:ఖేఢ్ ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి
April 16, 2026 02:38 PM 109 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలో పట్టణ ప్రజల కోసం నిర్మిస్తున్న అర్బన్ ఫారెస్ట్ పార్క్ పనులను స్థానిక శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి మార్నింగ్ వాక్ కార్యక్రమంలో భాగంగా సందర్శించి సమీక్షించారు. పార్కు ప్రాంతమంతా తిరిగి జరుగుతున్న పనుల పురోగతిని తెలుసుకుంటూ, సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరుగుతున్న కాలుష్య పరిస్థితుల్లో ప్రజలకు స్వచ్ఛమైన గాలి, ప్రశాంత వాతావరణం అందించాలనే లక్ష్యంతో ఈ పార్క్‌ను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. పట్టణ ప్రజలు ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఉదయం, సాయంత్రం వేళల్లో వ్యాయామం చేయడానికి, సేదతీరడానికి ఈ పార్క్ ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.పార్కులో వాకింగ్ ట్రాక్‌లు, పిల్లల ఆట స్థలాలు, విభిన్న రకాల మొక్కల నాటడం వంటి పనులను వేగవంతంగా పూర్తి చేసి నిర్ణీత గడువులో అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తున్న ఈ పార్క్ పర్యావరణ పరిరక్షణకు తోడ్పడటమే కాకుండా పట్టణానికి కొత్త అందాన్ని తీసుకువస్తుందని, పట్టణ ప్రజలతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు కూడా కుటుంబ సభ్యులతో కలిసి గడపడానికి అనువైన ప్రదేశంగా మారుతుందని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో పండరి రెడ్డి, రామచందర్ మాజీ ఎంపీటీసీలు, బాణాపురం రాజు, రుక్మిణి గోపాల్ రెడ్డి, షారుఖాన్, మహేష్ చౌహన్, సుబుర్, మున్సిపల్ కౌన్సిలర్లు, గంగారెడ్డి, సంగ్రామ్, మహేందర్ నాయక్ తదితర స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు పట్టణ ప్రజలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News