Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జయశంకర్ జయంతి... ఎన్జీలో ఘనస్మృతి తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 07, 2026 01:18 AM

మార్డి గ్రామ సందర్శనలో ఆరోపణలపై చర్చలు – అభివృద్ధి పనులపై దృష్టి

మార్డి గ్రామ సందర్శనలో ఆరోపణలపై చర్చలు – అభివృద్ధి పనులపై దృష్టి

మార్డి గ్రామ సందర్శనలో ఆరోపణలపై చర్చలు – అభివృద్ధి పనులపై దృష్టి
24-04-2026 66 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

జిల్లా కార్యక్రమ నిర్వహణ అధికారి ఐబీ జాన్ కెనడీ, జిల్లా కార్యక్రమ నిర్వహణ అధికారి ఆర్థిక విభాగం వెంకటేశం, స్త్రీనిధి ప్రాంతీయ అధికారి కలిసి కల్హేర్ మండల పరిధిలోని మార్డి గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో సమావేశం నిర్వహించి, గతంలో పనిచేసిన అరుణపై వచ్చిన ఆరోపణలపై గ్రామ పెద్దలతో చర్చించారు. అనంతరం గ్రామ సంఘ భవనాన్ని పరిశీలించారు. తరువాత బ్యాంకు మేనేజర్‌ను కలిసి బ్యాంకు అనుసంధానం, ఆహార ఉత్పత్తుల ప్రోత్సాహక పథకం, ఉపాధి సృష్టి పథకాల రుణాలపై చర్చించారు. అలాగే మండల సమాఖ్యలో ఉన్న ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. మండల సమాఖ్య కార్యాలయంలో సిబ్బందితో సమావేశం నిర్వహించి, వివిధ కార్యక్రమాల పురోగతిపై సమీక్ష చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం వంశీ కృష్ణ, సర్పంచ్ విజయలక్ష్మి, రవీందర్ రెడ్డి, గ్రామ పెద్దలు జితేందర్ రెడ్డి, నరసింహ రెడ్డి, అనిల్ రెడ్డి, సీసీలు రాములు, కల్పనా తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మార్డి గ్రామ సందర్శనలో ఆరోపణలపై చర్చలు – అభివృద్ధి పనులపై దృష్టి

Article Image

జిల్లా కార్యక్రమ నిర్వహణ అధికారి ఐబీ జాన్ కెనడీ, జిల్లా కార్యక్రమ నిర్వహణ అధికారి ఆర్థిక విభాగం వెంకటేశం, స్త్రీనిధి ప్రాంతీయ అధికారి కలిసి కల్హేర్ మండల పరిధిలోని మార్డి గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో సమావేశం నిర్వహించి, గతంలో పనిచేసిన అరుణపై వచ్చిన ఆరోపణలపై గ్రామ పెద్దలతో చర్చించారు. అనంతరం గ్రామ సంఘ భవనాన్ని పరిశీలించారు. తరువాత బ్యాంకు మేనేజర్‌ను కలిసి బ్యాంకు అనుసంధానం, ఆహార ఉత్పత్తుల ప్రోత్సాహక పథకం, ఉపాధి సృష్టి పథకాల రుణాలపై చర్చించారు. అలాగే మండల సమాఖ్యలో ఉన్న ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. మండల సమాఖ్య కార్యాలయంలో సిబ్బందితో సమావేశం నిర్వహించి, వివిధ కార్యక్రమాల పురోగతిపై సమీక్ష చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం వంశీ కృష్ణ, సర్పంచ్ విజయలక్ష్మి, రవీందర్ రెడ్డి, గ్రామ పెద్దలు జితేందర్ రెడ్డి, నరసింహ రెడ్డి, అనిల్ రెడ్డి, సీసీలు రాములు, కల్పనా తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News