Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జయశంకర్ జయంతి... ఎన్జీలో ఘనస్మృతి తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 07, 2026 04:04 AM

మనూరు మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షులుగా బిరాధర్ దత్తు ఏకగ్రీవ ఎన్నిక

మనూరు మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షులుగా బిరాధర్ దత్తు ఏకగ్రీవ ఎన్నిక

మనూరు మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షులుగా బిరాధర్ దత్తు ఏకగ్రీవ ఎన్నిక
27-02-2026 200 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలోని మనూరు మండలంలో సర్పంచ్ ఫోరం నూతన కమిటీని శుక్రవారం మండల సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో పరస్పర చర్చలు,ఏకాభిప్రాయంతో ఫోరం అధ్యక్షులుగా దోసపల్లి సర్పంచ్ బిరాధర్ దత్తును,ఉపాధ్యక్షులుగా ఎంబడి సంగారెడ్డిని ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు బిరాధర్ దత్తు మాట్లాడుతూ, మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల సమగ్ర అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు వేగంగా జరిగేలా కృషి చేస్తామని, సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేలా ఫోరం వేదికగా పనిచేస్తామని చెప్పారు. సర్పంచుల హక్కుల పరిరక్షణ, గ్రామ నిధుల సమర్థ వినియోగం, పారదర్శక పరిపాలన కోసం అందరితో కలిసి ముందుకు సాగుతామని హామీ ఇచ్చారు.ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన రాణపూర్ సర్పంచ్ ఎంబడి సంగారెడ్డి మాట్లాడుతూ, మండలంలోని అన్ని సర్పంచులను సమన్వయం చేస్తూ గ్రామాభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేస్తామని తెలిపారు. తాగునీరు, పారిశుధ్యం, రహదారులు, విద్య, ఆరోగ్య రంగాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు.సమావేశంలో పాల్గొన్న సర్పంచులు నూతన కమిటీపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. గ్రామాల అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ఫోరం చురుకుగా పనిచేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో మండలంలోని సర్పంచులు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Sthanikam

మనూరు మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షులుగా బిరాధర్ దత్తు ఏకగ్రీవ ఎన్నిక

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలోని మనూరు మండలంలో సర్పంచ్ ఫోరం నూతన కమిటీని శుక్రవారం మండల సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో పరస్పర చర్చలు,ఏకాభిప్రాయంతో ఫోరం అధ్యక్షులుగా దోసపల్లి సర్పంచ్ బిరాధర్ దత్తును,ఉపాధ్యక్షులుగా ఎంబడి సంగారెడ్డిని ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు బిరాధర్ దత్తు మాట్లాడుతూ, మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల సమగ్ర అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు వేగంగా జరిగేలా కృషి చేస్తామని, సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేలా ఫోరం వేదికగా పనిచేస్తామని చెప్పారు. సర్పంచుల హక్కుల పరిరక్షణ, గ్రామ నిధుల సమర్థ వినియోగం, పారదర్శక పరిపాలన కోసం అందరితో కలిసి ముందుకు సాగుతామని హామీ ఇచ్చారు.ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన రాణపూర్ సర్పంచ్ ఎంబడి సంగారెడ్డి మాట్లాడుతూ, మండలంలోని అన్ని సర్పంచులను సమన్వయం చేస్తూ గ్రామాభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేస్తామని తెలిపారు. తాగునీరు, పారిశుధ్యం, రహదారులు, విద్య, ఆరోగ్య రంగాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు.సమావేశంలో పాల్గొన్న సర్పంచులు నూతన కమిటీపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. గ్రామాల అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ఫోరం చురుకుగా పనిచేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో మండలంలోని సర్పంచులు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News