మనూర్లో బీరప్ప కామరాతి కళ్యాణం మహోత్సవంలో పాల్గొన్న:ఖేఢ్ మున్సిపల్ చైర్మన్
మనూర్లో బీరప్ప కామరాతి కళ్యాణం మహోత్సవంలో పాల్గొన్న:ఖేఢ్ మున్సిపల్ చైర్మన్
Sthanikam joint District Staff Reporter krishna
నారాయణఖేడ్ నియోజికవర్గంలోని మనూర్ మండల కేంద్రంలో ఐదు రోజులుగా ఘనంగా జరుగుతున్న బీరప్ప కామరాతి కళ్యాణం మహోత్సవం భక్తి, సంప్రదాయం, సామూహిక ఐక్యతకు ప్రతీకగా నిలుస్తోంది. ఈ వేడుకల్లో నారాయణఖేడ్ మున్సిపల్ చైర్మన్ నాగేష్ కూమార్ షేట్కార్,పీసీసీ సభ్యుడు కె. శ్రీనివాస్ పాల్గొన్నారు.మహోత్సవ సందర్భంలో వారు బీరప్ప స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఏర్పాటు చేసిన సభలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గొల్ల కురుమ సంఘం అధ్యక్షుడు మాలశెట్టి శాలువాతో సత్కరించబడ్డారు. సభలో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకలను మరింత ఉత్సాహభరితంగా మార్చారు.కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సిద్ధారెడ్డి, మండల స్థాయి నాయకుడు రఘువాచారి, నియోజికవర్గ ఎస్సీ విభాగ అధ్యక్షుడు సాయిలు, కంగ్టి మండల యువ నాయకుడు కాలే రాజు, మాణిక్ ప్రభు, మోహన్ రెడ్డి, సతీష్, భూమగొండ, ప్రసాద్, కొండల్ రెడ్డి, చామకుల పాండు, సాయి చరణ్, మూఢ శ్రీను తదితరులు పాల్గొన్నారు.
ఈ మహోత్సవం ప్రాంతీయ సంప్రదాయాల పరిరక్షణకు, భక్తి భావాల పెంపొందింపుకు, సామాజిక ఐక్యతకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. గ్రామీణ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుతూ ప్రజలందరినీ ఒక్కటిగా చేర్చే ఆధ్యాత్మిక ఉత్సవంగా ఈ వేడుక విశేషంగా ఆకట్టుకుంది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి