Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నిజాయితీకి నిదర్శనం సెక్యూరిటీ సిబ్బంది మరిచిపోయిన మొబైల్‌ను భక్తునికి అప్పగింపు ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ “అంధకారంలో వెలుగైన మహనీయుడు: అంబేద్కర్ చూపిన సమానత్వ దారి” – డి.డి. దాస్ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం.. కోర్టుల కంటే మీరే ఎక్కువా..? సన్‌రైజర్స్ 'ఉపేషారు'.. కుర్రాళ్ల దెబ్బకు రాజస్థాన్ విలవిల! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 16, 2026 06:43 PM

మానూర్ మండలంలో పంచాయతీ కార్యదర్శుల ఫోరం నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక

మానూర్ మండలంలో పంచాయతీ కార్యదర్శుల ఫోరం నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక

మానూర్ మండలంలో పంచాయతీ కార్యదర్శుల ఫోరం నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక
April 16, 2026 05:04 PM 63 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

మానూర్ మండల పంచాయతీ కార్యదర్శుల ఫోరం నూతన కమిటీ ఎన్నికలు ఘనంగా నిర్వహించబడ్డాయి. నారాయణఖేడ్ టీఎన్‌జీఓ యూనిట్ జనరల్ సెక్రటరీ మిస్కిన్ అధ్యక్షతన, తెలంగాణ పంచాయతీ సెక్రటరీస్ జిల్లా ఫోరం జనరల్ సెక్రటరీ జె.రాజు ఆధ్వర్యంలో, జిల్లా ఫోరం ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీ బాలు, పబ్లిసిటీ సెక్రటరీ సుభాష్ మరియు పలువురు పంచాయతీ కార్యదర్శుల సమక్షంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించబడింది. ఎన్నికల అధికారిగా వ్యవహరించిన జె.రాజు పర్యవేక్షణలో కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా నర్ముల సంతోష్, ఉపాధ్యక్షులుగా చంద్రశేఖర్, జనరల్ సెక్రటరీగా చి. సంతోష్, కోశాధికారిగా ఎం.సంగీత, జాయింట్ సెక్రటరీగా బి.కళావతి, స్పోర్ట్స్ సెక్రటరీగా నాందేవ్‌ను ఎన్నుకోగా, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా నరేష్ చారి, శ్రీను రాథోడ్, రాజ్ కుమార్, గణపతి ఎంపికయ్యారు. అనంతరం మండల ప్రత్యేక అధికారి రఘుబాబు, ఎంపీడీవో చంద్రశేఖర్ చేతుల మీదుగా టీపీఎస్సీఎఫ్-2026 డైరీ మరియు టీపీఎస్‌డీఎఫ్ సంగారెడ్డి జిల్లా టేబుల్ క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, పంచాయతీ కార్యదర్శుల సమస్యల పరిష్కారం మరియు గ్రామాభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలని నాయకులు ఆకాంక్షించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News