చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని మునుగోటి వెంకన్న అకాల మరణం పట్ల సహోద్యోగులు మానవత్వాన్ని చాటుకున్నారు. పంతంగి టోల్ ప్లాజాలో ఉద్యోగిగా పనిచేస్తూ ఇటీవల మరణించిన వెంకన్న కుటుంబానికి తోటి ఉద్యోగులు, సిబ్బంది కలిసి శుక్రవారం రోజు లక్ష రూపాయల ఆర్థిక సాయం అందజేశారు.
మృతుని నివాసానికి వెళ్లిన సిబ్బంది ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా “వెంకన్న కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని” వారు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో టోల్ ప్లాజాలో పనిచేస్తున్న పలువురు సిబ్బంది పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి