Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 22, 2026 08:37 PM

మల్లేశం ఆకస్మిక మృతి.. కుటుంబాన్ని పరామర్శించిన భిక్షపతి

మల్లేశం ఆకస్మిక మృతి.. కుటుంబాన్ని పరామర్శించిన భిక్షపతి

మల్లేశం ఆకస్మిక మృతి.. కుటుంబాన్ని పరామర్శించిన భిక్షపతి
March 22, 2026 06:53 PM 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ఆందోల్ నియోజకవర్గం పరిధిలోని రాయికోడ్ గ్రామ సర్పంచ్ బాలమొల్ల తుకారం సోదరుడు బాలమొల్ల మల్లేశం హఠాత్తుగా మరణించడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ విషాద వార్త తెలుసుకున్న మాజీ కార్పొరేషన్ చైర్మన్ మఠం భిక్షపతి ఆదివారం స్వయంగా మల్లేశం నివాసానికి చేరుకుని, ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా మల్లేశం కుటుంబ సభ్యులను పరామర్శించిన భిక్షపతి, వారికి ధైర్యం చెప్పి ఆత్మస్థైర్యాన్ని కల్పించారు. ఇలాంటి క్లిష్ట సమయంలో కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో రాయిపల్లి సర్పంచ్ బస్వరాజ్, ఔరంగానగర్ మాజీ సర్పంచ్ నాగార్జున, పవన్, మల్లు, రాయికోడ్ గ్రామ పార్టీ అధ్యక్షుడు మల్లేశం, మొట్లకుంట సంగమేశ్వర్‌తో పాటు పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొని మల్లేశం మరణంపై తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News