మల్కాజ్గిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు
మల్కాజ్గిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు
Prabhakar
జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మల్కాజిగిరిలో వివిధ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. కళాశాలలోని భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం తదితర సైన్స్ విభాగాలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాయి. ఈ ఏడాది థీమ్ ‘ఉమెన్ ఇన్ సైన్స్: క్యాటలైజింగ్ విక్సిత్ భారత్’కు అనుగుణంగా విద్యార్థులు శాస్త్ర రంగంలో మహిళల పాత్ర, వారి కృషిని హైలైట్ చేస్తూ ప్రసంగాలు చేశారు.
కార్యక్రమంలో భాగంగా విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథం పెంపొందించేందుకు వక్తృత్వ పోటీలు నిర్వహించారు. పోటీలలో విజేతలైన విద్యార్థులకు సభాధ్యక్షులు డాక్టర్ అడవి రాజు బహుమతులు అందజేశారు. సభలో అధ్యక్షత వహించిన కళాశాల ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ డాక్టర్ అడవి రాజు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ సైంటిఫిక్ టెంపర్ను పెంపొందించుకోవాలని, శాస్త్రీయ ఆలోచనా విధానం సమాజ అభివృద్ధికి అత్యవసరమని పేర్కొన్నారు. అన్ని సబ్జెక్టులు పరస్పర ఆధారితమై ఉన్నందున విద్యార్థులు విభిన్న శాస్త్రాలను సమగ్రంగా అభ్యసించాలని సూచించారు.
భౌతిక శాస్త్ర అధ్యాపకురాలు డాక్టర్ హరిత రామన్ ప్రభావం ప్రాముఖ్యతను వివరించి, సి.వి. రామన్ కనుగొన్న ఈ ఆవిష్కరణ భారతదేశానికి గౌరవాన్ని తీసుకొచ్చిందని తెలిపారు. రసాయన శాస్త్ర పరిశోధనల్లో రామన్ ప్రభావం ఎలా ఉపయోగపడుతుందో రసాయన శాస్త్ర అధ్యాపకురాలు డాక్టర్ స్వాతి వివరించారు.
వృక్షశాస్త్ర అధ్యాపకురాలు డాక్టర్ లలిత మాట్లాడుతూ, నేటి థీమ్ ప్రాముఖ్యతను తెలియజేస్తూ శాస్త్ర రంగంలో మహిళలు అన్ని విభాగాలలో విశేష కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. విద్యార్థినులు శాస్త్ర పరిశోధనల వైపు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమానికి జంతుశాస్త్ర అధ్యాపకులు గుణాకర్ వ్యాఖ్యాతగా వ్యవహరించి కార్యక్రమాన్ని నడిపించారు. కార్యక్రమంలో డాక్టర్ తుడి వెంకట రెడ్డి, డాక్టర్ జగన్, ఇతర అధ్యపక బృంద విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి