మల్బరీ తోటను పరిశీలించిన మంత్రి సవిత
మల్బరీ తోటను పరిశీలించిన మంత్రి సవిత
EDIGA NAVEENKUMAR
పెనుకొండ నియోజకవర్గ పరిధిలోని పరిగి మండలంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి వెళ్తున్న సందర్భంగా మనేసముద్రం గ్రామ సమీపంలో రోడ్డు పక్కన ఉన్న రైతు చౌడప్పకు చెందిన మల్బరీ తోటను రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖల మంత్రి సవిత పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి సవిత రైతుతో మాట్లాడి పంట దిగుబడి, పెట్టుబడి–రాబడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. మల్బరీ సాగులో ఎదురవుతున్న సమస్యలను కూడా వివరంగా విచారించారు. పట్టు రైతులకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
రైతులకు రోజుకు 9 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామని తెలిపారు. అలాగే “అన్నదాత సుఖీభవ” పథకం కింద రూ.20,000 ఆర్థిక సహాయం అందిస్తున్నామని పేర్కొన్నారు. రేషన్ షెడ్లను సబ్సిడీతో మంజూరు చేస్తున్నామని, సబ్సిడీ ధరలతో ఎరువులు అందిస్తున్నామని చెప్పారు. ప్రతి రైతు ఈ ప్రభుత్వ సదుపాయాలను వినియోగించు కోవాలని మంత్రి సూచించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి