Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 11, 2026 04:41 PM

మాజీ కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత

మాజీ కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత

మాజీ కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత
March 11, 2026 03:13 PM 67 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sangareddy & Manoor
Sthanikam joint District Staff Reporter krishna

కేంద్ర మాజీ మంత్రి కావూరు సాంబశివరావు (82) కన్నుమూశారు. హైదరాబాద్లోని స్టార్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కావూరు సాంబశివరావు బుధవారం తుదిశ్వాస విడిచారు.ఈ నెల 7న హైదరాబాద్‌ లోని స్వగృహంలో కావూరికి బ్రెయిన్‌స్ట్రోక్‌ రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. వెంటిలేటర్‌ సాయంతో చికిత్స అందిస్తున్నామని, పరిస్థితి విషమంగా ఉందని వైద్యవర్గాలు అప్పుడే తెలిపాయి.నేడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.మచిలీపట్నం, ఏలూరు నుంచి సాంబశివరావు ఐదుసార్లు ఎంపీగా గెలిచారు. అలాగే మన్మోహన్‌ సింగ్‌ కేబినెట్లో కేంద్రమంత్రిగా పని చేశారు. 2014లో రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌కు కావూరు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. 1943లో ఏలూరులో జన్మించిన సాంబశివరావు, వరంగల్‌ ఆర్‌ఈసీ నుంచి ఇంజినీరింగ్‌ పట్టా పుచ్చుకున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News