Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఏబీవీపీ ఆధ్వర్యంలో చౌటుప్పల్‌లో విద్యాసంస్థల బంద్ సక్సెస్! కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 24, 2026 07:02 AM

మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం

మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం

మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం
February 28, 2026 06:34 AM 13 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

మైనార్టీల సంక్షేమ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం...

కాంగ్రెస్ ప్రభుత్వంలో మైనార్టీలకు పెద్దపీట....

ముస్లిం సోదరుల ఉపవాస దీక్షలు విజయవంతం కావాలి....

కోదాడ మున్సిపల్ 33 వార్డ్ మైనార్టీ నాయకులు జానిమియా కుమారులు అజ్మత్, రెహ్మత్ల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్....

రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందులు పుణ్య కార్యాలను కోదాడ ఎమ్మెల్యే పద్మావతి ఉత్తం అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని 33వ వార్డులో మైనార్టీ నాయకులు అజ్మత్ , రెహ్మత్ లు తమ తండ్రి జానీమియా జ్ఞాపకార్థం ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందును ఆమె ప్రారంభించి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమ ప్రభుత్వం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మైనార్టీలకు పెద్ద పీట వేశామన్నారు. కోదాడలో ఈద్గా, ఖబరస్టాన్, షాది ఖానా లకు లక్షల రూపాయల నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేశామన్నారు. మైనార్టీలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. రంజాన్ మాసం పవిత్రమైందని, ముస్లింల ఉపవాస దీక్షలు విజయవంతం కావాలన్నారు. ముస్లిం సోదరులకు ముందస్తుగా రంజాన్ మాస శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం లో ,మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బషీర్,కౌన్సిలర్లు ఏసుపాదం , నేహా నాజ్, గంధం బాలేంద్ర పాండు,నాయకులు ఎర్నేని బాబు, మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్ జబ్బార్,కే ఎల్ ఎన్ ప్రసాద్, బాగ్దాద్ , బాజన్, షఫీ, ముస్తఫా, ఖాజా, షమ్మీ నయీం , రహీం ఉన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News