మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం
మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం
Harish HS
మైనార్టీల సంక్షేమ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం...
కాంగ్రెస్ ప్రభుత్వంలో మైనార్టీలకు పెద్దపీట....
ముస్లిం సోదరుల ఉపవాస దీక్షలు విజయవంతం కావాలి....
కోదాడ మున్సిపల్ 33 వార్డ్ మైనార్టీ నాయకులు జానిమియా కుమారులు అజ్మత్, రెహ్మత్ల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్....
రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందులు పుణ్య కార్యాలను కోదాడ ఎమ్మెల్యే పద్మావతి ఉత్తం అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని 33వ వార్డులో మైనార్టీ నాయకులు అజ్మత్ , రెహ్మత్ లు తమ తండ్రి జానీమియా జ్ఞాపకార్థం ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందును ఆమె ప్రారంభించి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమ ప్రభుత్వం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మైనార్టీలకు పెద్ద పీట వేశామన్నారు. కోదాడలో ఈద్గా, ఖబరస్టాన్, షాది ఖానా లకు లక్షల రూపాయల నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేశామన్నారు. మైనార్టీలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. రంజాన్ మాసం పవిత్రమైందని, ముస్లింల ఉపవాస దీక్షలు విజయవంతం కావాలన్నారు. ముస్లిం సోదరులకు ముందస్తుగా రంజాన్ మాస శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం లో ,మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బషీర్,కౌన్సిలర్లు ఏసుపాదం , నేహా నాజ్, గంధం బాలేంద్ర పాండు,నాయకులు ఎర్నేని బాబు, మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్ జబ్బార్,కే ఎల్ ఎన్ ప్రసాద్, బాగ్దాద్ , బాజన్, షఫీ, ముస్తఫా, ఖాజా, షమ్మీ నయీం , రహీం ఉన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి