Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎమ్మార్పీఎస్ సూర్యపేట జిల్లా ప్రధాన కార్యదర్శిగా వంగాల వెంకన్న మాదిగ నియామకం కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 24, 2026 04:57 PM

మైనర్లకు పొగాకు విక్రయాలపై కఠిన చర్యలు

మైనర్లకు పొగాకు విక్రయాలపై కఠిన చర్యలు

మైనర్లకు పొగాకు విక్రయాలపై కఠిన చర్యలు
March 03, 2026 01:45 PM 125 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy


చిట్యాలలో పాఠశాలల పరిధిలో కిరాణా, పాన్ షాపులపై పోలీసుల హెచ్చరిక

నల్గొండ జిల్లాలో మైనర్లకు పొగాకు ఉత్పత్తుల విక్రయాలపై పోలీస్ శాఖ కఠిన చర్యలు చేపట్టింది. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు చిట్యాల పట్టణ కేంద్రంలో ఉన్న పాఠశాలల సమీప ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.చిట్యాల పట్టణంలోని పాఠశాలల నుండి 100 మీటర్ల పరిధిలో ఉన్న కిరాణా దుకాణాలు, పాన్ షాపుల యజమానులను పోలీసులు అప్రమత్తం చేశారు. మైనర్లకు గుట్కా, సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులు విక్రయించకూడదని స్పష్టమైన సూచనలు జారీ చేశారు.

ఈ సందర్భంగా చిట్యాల ఎస్ఐ మామిడి రవికుమార్ మాట్లాడుతూ, పాఠశాలల పరిసరాల్లో బాలల ఆరోగ్యానికి హానికరమైన ఉత్పత్తుల విక్రయంపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

పోలీసుల ఈ చర్యలకు పలువురు తల్లిదండ్రులు, స్థానికులు స్వాగతం పలికారు. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ కోసం ఇటువంటి చర్యలు కొనసాగాలని వారు కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News