మైనర్లకు పొగాకు విక్రయాలపై కఠిన చర్యలు
మైనర్లకు పొగాకు విక్రయాలపై కఠిన చర్యలు
Komidala Mahender reddy
చిట్యాలలో పాఠశాలల పరిధిలో కిరాణా, పాన్ షాపులపై పోలీసుల హెచ్చరిక
నల్గొండ జిల్లాలో మైనర్లకు పొగాకు ఉత్పత్తుల విక్రయాలపై పోలీస్ శాఖ కఠిన చర్యలు చేపట్టింది. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు చిట్యాల పట్టణ కేంద్రంలో ఉన్న పాఠశాలల సమీప ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.చిట్యాల పట్టణంలోని పాఠశాలల నుండి 100 మీటర్ల పరిధిలో ఉన్న కిరాణా దుకాణాలు, పాన్ షాపుల యజమానులను పోలీసులు అప్రమత్తం చేశారు. మైనర్లకు గుట్కా, సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులు విక్రయించకూడదని స్పష్టమైన సూచనలు జారీ చేశారు.
ఈ సందర్భంగా చిట్యాల ఎస్ఐ మామిడి రవికుమార్ మాట్లాడుతూ, పాఠశాలల పరిసరాల్లో బాలల ఆరోగ్యానికి హానికరమైన ఉత్పత్తుల విక్రయంపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
పోలీసుల ఈ చర్యలకు పలువురు తల్లిదండ్రులు, స్థానికులు స్వాగతం పలికారు. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ కోసం ఇటువంటి చర్యలు కొనసాగాలని వారు కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి