Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కన్నతల్లిని, కళ్లులేని అన్నను కాటేసిన కనికరం లేని చెల్లి! ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! మాజీ మంత్రి పల్లె ని కలిసిన టీడీపీ అధ్యక్షురాలు పర్వీన్ భాను ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ “అంధకారంలో వెలుగైన మహనీయుడు: అంబేద్కర్ చూపిన సమానత్వ దారి” – డి.డి. దాస్ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 19, 2026 10:56 PM

మహిళల హక్కుల కోసం పోరాటం కొనసాగుతుంది: నిర్మల జగ్గారెడ్డి

మహిళల హక్కుల కోసం పోరాటం కొనసాగుతుంది: నిర్మల జగ్గారెడ్డి

మహిళల హక్కుల కోసం పోరాటం కొనసాగుతుంది: నిర్మల జగ్గారెడ్డి
April 19, 2026 09:01 PM 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

మహిళా బిల్లుకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని బీజేపీ చేస్తున్న ప్రచారం పూర్తిగా తప్పుదారి పట్టించే ప్రయత్నమని టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మల జగ్గారెడ్డి ఖండించారు. సంగారెడ్డిలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, మహిళా సాధికారతకు కాంగ్రెస్ పార్టీ తొలి నుంచే కట్టుబడి ఉందని, గతంలో మహిళా బిల్లుకు మద్దతు ఇచ్చి ఆమోదం పొందేలా చేసిన పార్టీ కాంగ్రెస్ేనని గుర్తుచేశారు. మహిళా బిల్లును డీలిమిటేషన్‌తో కలిపి ప్రవేశపెట్టడం వెనుక బీజేపీ రాజకీయ కుట్ర దాగి ఉందని, ఈ అంశాన్ని స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటోందని విమర్శించారు.పార్లమెంట్‌లో మహిళా బిల్లును వేరుగా ప్రవేశపెడితే కాంగ్రెస్ తప్పకుండా మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. బీజేపీలో మహిళలకు తగిన ప్రాధాన్యం లేదని, ఇప్పటివరకు ఒక్క మహిళను కూడా ప్రధాని స్థాయికి తీసుకురాలేదని పేర్కొంటూ, కాంగ్రెస్ పార్టీ ఇందిరా గాంధీని దేశానికి ప్రధాని చేసిన ఘనత కలిగిందని అన్నారు. డీలిమిటేషన్ పేరుతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసి ఉత్తరాది రాష్ట్రాలకు లాభం చేకూర్చే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మహిళలకు ప్రాధాన్యం పెరుగుతోందని, వారి ఆర్థిక అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాబోయే సమావేశాల్లో మహిళా బిల్లును ప్రత్యేకంగా ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ, లేదంటే మహిళల హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News