మహిళల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది – నిర్మలా జగ్గారెడ్డి
మహిళల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది – నిర్మలా జగ్గారెడ్డి
Krishna
రాష్ట్రంలో మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి తెలిపారు. బుధవారం కొండాపూర్ మండల పరిధిలోని తేర్పోల్, ఎదురుగుడెం గ్రామాల్లో ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న మహిళా సమాఖ్య భవనాలకు ఆమె భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నారని, మహిళలను ఆర్థికంగా బలపరిచేందుకు డ్వాక్రా సంఘాల ద్వారా తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తున్నామని తెలిపారు.అలాగే రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం, ఇంద్రమ్మ చీరలు పంపిణీ, మహిళల పేరుపై కొత్త రేషన్ కార్డులు, ఇల్లు లేని వారికి మహిళల పేరుమీదే ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణానికి విడతల వారీగా రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించడం వంటి పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. గత ప్రభుత్వాల మాదిరిగా మాటలకే పరిమితం కాకుండా, పనులతో ప్రజల విశ్వాసం పొందుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు, సర్పంచ్ సతీష్, కాంగ్రెస్ నాయకులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి