Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 04:48 PM

మహిళా సమైక్య బలోపేతానికి పలు కమిటీల ఏర్పాటు

మహిళా సమైక్య బలోపేతానికి పలు కమిటీల ఏర్పాటు

మహిళా సమైక్య బలోపేతానికి పలు కమిటీల ఏర్పాటు
March 07, 2026 06:00 PM 71 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలో మనూరు మండల మహిళా సమైక్యలో ఈరోజు సమైక్య బలోపేతం కోసం ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఇతర జిల్లాల నుంచి వచ్చిన సీనియర్ సిఆర్పీలు హాజరై మండల సమైక్యను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి అవసరమైన చర్యలపై మార్గదర్శకాలు అందించారు.సమైక్య పనులు సక్రమంగా సాగేందుకు మరియు బాధ్యతలను పంచుకునేందుకు పలు సబ్ కమిటీలను ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా పర్యవేక్షణ కమిటీ,సామాజిక పర్యవేక్షణ కమిటీ,బ్యాంకు లింకేజీ కమిటీ,జీవనోపాధుల కమిటీ మరియు ఆస్తి ధ్రువీకరణ కమిటీలను ఏర్పాటు చేశారు.ప్రతి కమిటీకి ప్రత్యేక బాధ్యతలు అప్పగించి,సమైక్య కార్యకలాపాలను పారదర్శకంగా మరియు సమర్థవంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.మండల సమైక్యపై ఉన్న బాధ్యతలు ఒక్కరిపై కాకుండా అన్ని సభ్యులపై సమానంగా ఉండేలా ఈ సబ్ కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.కమిటీల ద్వారా గ్రామ స్థాయిలో జరిగే కార్యక్రమాలను పర్యవేక్షించడం,సభ్యులకు అవసరమైన మార్గనిర్దేశం చేయడం మరియు సమైక్యను అన్ని రంగాల్లో బలోపేతం చేయడం ప్రధాన లక్ష్యంగా నిర్ణయించారు.సమావేశంలో సామాజిక భద్రత,మహిళల అభివృద్ధి,జీవనోపాధి అవకాశాలు వంటి అంశాలపై కూడా సభ్యులకు అవగాహన కల్పించారు. కమిటీలకు సంబంధించిన విధులు,బాధ్యతలు మరియు నిర్వహణ విధానం గురించి సవివరంగా వివరించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ సిఆర్పీలు వై సాయి లీల,వి చిన్నమ్మ, మండల సమాఖ్య ఏపీఎం అనంతయ్య పాల్గొని కమిటీల సభ్యులకు శిక్షణ ఇచ్చారు.అలాగే మండల సమైక్య అధ్యక్షురాలు,సిబ్బంది మరియు ఇతర సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News