Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా బుక్ రివ్యూ కార్యక్రమం కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 24, 2026 06:44 AM

మహిళా సమైక్య బలోపేతానికి పలు కమిటీల ఏర్పాటు

మహిళా సమైక్య బలోపేతానికి పలు కమిటీల ఏర్పాటు

మహిళా సమైక్య బలోపేతానికి పలు కమిటీల ఏర్పాటు
March 07, 2026 06:00 PM 66 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలో మనూరు మండల మహిళా సమైక్యలో ఈరోజు సమైక్య బలోపేతం కోసం ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఇతర జిల్లాల నుంచి వచ్చిన సీనియర్ సిఆర్పీలు హాజరై మండల సమైక్యను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి అవసరమైన చర్యలపై మార్గదర్శకాలు అందించారు.సమైక్య పనులు సక్రమంగా సాగేందుకు మరియు బాధ్యతలను పంచుకునేందుకు పలు సబ్ కమిటీలను ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా పర్యవేక్షణ కమిటీ,సామాజిక పర్యవేక్షణ కమిటీ,బ్యాంకు లింకేజీ కమిటీ,జీవనోపాధుల కమిటీ మరియు ఆస్తి ధ్రువీకరణ కమిటీలను ఏర్పాటు చేశారు.ప్రతి కమిటీకి ప్రత్యేక బాధ్యతలు అప్పగించి,సమైక్య కార్యకలాపాలను పారదర్శకంగా మరియు సమర్థవంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.మండల సమైక్యపై ఉన్న బాధ్యతలు ఒక్కరిపై కాకుండా అన్ని సభ్యులపై సమానంగా ఉండేలా ఈ సబ్ కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.కమిటీల ద్వారా గ్రామ స్థాయిలో జరిగే కార్యక్రమాలను పర్యవేక్షించడం,సభ్యులకు అవసరమైన మార్గనిర్దేశం చేయడం మరియు సమైక్యను అన్ని రంగాల్లో బలోపేతం చేయడం ప్రధాన లక్ష్యంగా నిర్ణయించారు.సమావేశంలో సామాజిక భద్రత,మహిళల అభివృద్ధి,జీవనోపాధి అవకాశాలు వంటి అంశాలపై కూడా సభ్యులకు అవగాహన కల్పించారు. కమిటీలకు సంబంధించిన విధులు,బాధ్యతలు మరియు నిర్వహణ విధానం గురించి సవివరంగా వివరించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ సిఆర్పీలు వై సాయి లీల,వి చిన్నమ్మ, మండల సమాఖ్య ఏపీఎం అనంతయ్య పాల్గొని కమిటీల సభ్యులకు శిక్షణ ఇచ్చారు.అలాగే మండల సమైక్య అధ్యక్షురాలు,సిబ్బంది మరియు ఇతర సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News