Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 03:46 PM

మధ్యాహ్న భోజన పథకంలో యాదాద్రి భువనగిరి ముందంజ

మధ్యాహ్న భోజన పథకంలో యాదాద్రి భువనగిరి ముందంజ

మధ్యాహ్న భోజన పథకంలో యాదాద్రి భువనగిరి ముందంజ
01-03-2026 113 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రాష్ట్ర స్థాయి సత్కారం అందుకున్న జిల్లా విద్యాధికారి కందుల సత్యనారాయణ

యాదాద్రి భువనగిరి: ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న PM POSHAN (మధ్యాహ్న భోజన పథకం) అమలులో యాదాద్రి భువనగిరి జిల్లా రాష్ట్రంలో ఉత్తమ స్థానాన్ని సాధించింది. 2025–26 విద్యా సంవత్సరంలో పథకాన్ని వినూత్నంగా, సమర్థవంతంగా అమలు చేసినందుకు జిల్లా విద్యాధికారి కందుల సత్యనారాయణ రాష్ట్ర స్థాయి సత్కారం అందుకున్నారు.

హైదరాబాద్‌లోని Directorate of School Education Telangana కార్యాలయంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ డా. నవీన్ నికోలస్, సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు సంచాలకుల ఆధ్వర్యంలో ఉత్తమంగా పనిచేసిన అధికారులను సత్కరించారు.

రాష్ట్రవ్యాప్తంగా ఇద్దరు జిల్లా విద్యాధికారులు, ఇద్దరు మండల విద్యాధికారులు, ఇద్దరు జూనియర్ సహాయకులు, ముగ్గురు ప్రధానోపాధ్యాయులు, ఒక కంప్యూటర్ నిర్వహణ సిబ్బంది, రెండు స్వయం సహాయక బృందాలను గుర్తించి ప్రశంసించారు. రాష్ట్ర స్థాయిలో ఎంపికైన ఇద్దరు జిల్లా విద్యాధికారులలో యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి కందుల సత్యనారాయణ ఒకరుగా నిలవడం జిల్లాకు గర్వకారణమైంది.

పథకం అమలులో పారదర్శకత, పర్యవేక్షణలో కట్టుదిట్టమైన చర్యలు, విద్యార్థులకు నాణ్యమైన పోషకాహారం అందించడంలో చూపిన అంకితభావం దృష్ట్యా ఈ గుర్తింపు లభించిందని అధికారులు తెలిపారు. క్షేత్రస్థాయి సిబ్బందిని ప్రోత్సహించడం, బాధ్యతాయుత వ్యవహారాన్ని పెంపొందించడం లక్ష్యంగా ఈ సత్కారం అందజేసినట్లు డైరెక్టర్ డా. నవీన్ నికోలస్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సంయుక్త సంచాలకులు ఎం. మదన్మోహన్, అదనపు సంచాలకురాలు ఉషారాణి పాల్గొని అభినందనలు తెలిపారు.

Sthanikam

మధ్యాహ్న భోజన పథకంలో యాదాద్రి భువనగిరి ముందంజ

Article Image

రాష్ట్ర స్థాయి సత్కారం అందుకున్న జిల్లా విద్యాధికారి కందుల సత్యనారాయణ

యాదాద్రి భువనగిరి: ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న PM POSHAN (మధ్యాహ్న భోజన పథకం) అమలులో యాదాద్రి భువనగిరి జిల్లా రాష్ట్రంలో ఉత్తమ స్థానాన్ని సాధించింది. 2025–26 విద్యా సంవత్సరంలో పథకాన్ని వినూత్నంగా, సమర్థవంతంగా అమలు చేసినందుకు జిల్లా విద్యాధికారి కందుల సత్యనారాయణ రాష్ట్ర స్థాయి సత్కారం అందుకున్నారు.

హైదరాబాద్‌లోని Directorate of School Education Telangana కార్యాలయంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ డా. నవీన్ నికోలస్, సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు సంచాలకుల ఆధ్వర్యంలో ఉత్తమంగా పనిచేసిన అధికారులను సత్కరించారు.

రాష్ట్రవ్యాప్తంగా ఇద్దరు జిల్లా విద్యాధికారులు, ఇద్దరు మండల విద్యాధికారులు, ఇద్దరు జూనియర్ సహాయకులు, ముగ్గురు ప్రధానోపాధ్యాయులు, ఒక కంప్యూటర్ నిర్వహణ సిబ్బంది, రెండు స్వయం సహాయక బృందాలను గుర్తించి ప్రశంసించారు. రాష్ట్ర స్థాయిలో ఎంపికైన ఇద్దరు జిల్లా విద్యాధికారులలో యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి కందుల సత్యనారాయణ ఒకరుగా నిలవడం జిల్లాకు గర్వకారణమైంది.

పథకం అమలులో పారదర్శకత, పర్యవేక్షణలో కట్టుదిట్టమైన చర్యలు, విద్యార్థులకు నాణ్యమైన పోషకాహారం అందించడంలో చూపిన అంకితభావం దృష్ట్యా ఈ గుర్తింపు లభించిందని అధికారులు తెలిపారు. క్షేత్రస్థాయి సిబ్బందిని ప్రోత్సహించడం, బాధ్యతాయుత వ్యవహారాన్ని పెంపొందించడం లక్ష్యంగా ఈ సత్కారం అందజేసినట్లు డైరెక్టర్ డా. నవీన్ నికోలస్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సంయుక్త సంచాలకులు ఎం. మదన్మోహన్, అదనపు సంచాలకురాలు ఉషారాణి పాల్గొని అభినందనలు తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News