Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జయశంకర్ జయంతి... ఎన్జీలో ఘనస్మృతి తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 07, 2026 03:13 AM

లోక్ అదాలత్ అవకాశాన్ని వినియోగించుకోండి: సీఐ వెంకటరెడ్డి

లోక్ అదాలత్ అవకాశాన్ని వినియోగించుకోండి: సీఐ వెంకటరెడ్డి

లోక్ అదాలత్ అవకాశాన్ని వినియోగించుకోండి: సీఐ వెంకటరెడ్డి
23-03-2026 40 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

కంగ్టి సీఐ వెంకటరెడ్డి ప్రజలకు లోక్ అదాలత్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆదివారం మాట్లాడుతూ, ఈ నెల 28న నారాయణఖేడ్ కోర్టులో లోక్ అదాలత్ నిర్వహించబడుతుందని తెలిపారు.సిర్గాపూర్, కల్హేర్, కంగ్జి మండలాల ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తమకు సంబంధించిన వివిధ కేసులను సులభంగా పరిష్కరించుకోవాలని కోరారు.లోక్ అదాలత్ ద్వారా యాక్సిడెంట్ కేసులు, గొడవలు, చీటింగ్, చిట్‌ఫండ్ వివాదాలు, చిన్నపాటి దొంగతనాలు, అక్రమ రవాణా వంటి పలు రకాల కేసుల్లో ఇరువర్గాల మధ్య రాజీ కుదుర్చుకునే అవకాశం ఉంటుందని వివరించారు. కోర్టు ప్రక్రియలతో పోలిస్తే, లోక్ అదాలత్‌లో వేగంగా, తక్కువ ఖర్చుతో సమస్యలకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు.అలాగే ఈ నెల 23 నుంచి 28 వరకు సంబంధిత పోలీస్ స్టేషన్లు లేదా కోర్టుకు హాజరై ఇరువర్గాలు పరస్పరం చర్చించి రాజీకి రావచ్చని తెలిపారు. ఇలాంటి అవకాశాల ద్వారా సమయం, డబ్బు ఆదా అవుతుందని, పరస్పర విభేదాలు సఖ్యతగా ముగిసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.ప్రజలు ఈ లోక్ అదాలత్ అవకాశాన్ని వినియోగించుకుని తమ కేసులను సులభంగా పరిష్కరించుకోవాలని సీఐ వెంకటరెడ్డి విజ్ఞప్తి చేశారు.

Sthanikam

లోక్ అదాలత్ అవకాశాన్ని వినియోగించుకోండి: సీఐ వెంకటరెడ్డి

Article Image

కంగ్టి సీఐ వెంకటరెడ్డి ప్రజలకు లోక్ అదాలత్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆదివారం మాట్లాడుతూ, ఈ నెల 28న నారాయణఖేడ్ కోర్టులో లోక్ అదాలత్ నిర్వహించబడుతుందని తెలిపారు.సిర్గాపూర్, కల్హేర్, కంగ్జి మండలాల ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తమకు సంబంధించిన వివిధ కేసులను సులభంగా పరిష్కరించుకోవాలని కోరారు.లోక్ అదాలత్ ద్వారా యాక్సిడెంట్ కేసులు, గొడవలు, చీటింగ్, చిట్‌ఫండ్ వివాదాలు, చిన్నపాటి దొంగతనాలు, అక్రమ రవాణా వంటి పలు రకాల కేసుల్లో ఇరువర్గాల మధ్య రాజీ కుదుర్చుకునే అవకాశం ఉంటుందని వివరించారు. కోర్టు ప్రక్రియలతో పోలిస్తే, లోక్ అదాలత్‌లో వేగంగా, తక్కువ ఖర్చుతో సమస్యలకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు.అలాగే ఈ నెల 23 నుంచి 28 వరకు సంబంధిత పోలీస్ స్టేషన్లు లేదా కోర్టుకు హాజరై ఇరువర్గాలు పరస్పరం చర్చించి రాజీకి రావచ్చని తెలిపారు. ఇలాంటి అవకాశాల ద్వారా సమయం, డబ్బు ఆదా అవుతుందని, పరస్పర విభేదాలు సఖ్యతగా ముగిసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.ప్రజలు ఈ లోక్ అదాలత్ అవకాశాన్ని వినియోగించుకుని తమ కేసులను సులభంగా పరిష్కరించుకోవాలని సీఐ వెంకటరెడ్డి విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News