లోక్ అదాలత్ అవకాశాన్ని వినియోగించుకోండి: సీఐ వెంకటరెడ్డి
లోక్ అదాలత్ అవకాశాన్ని వినియోగించుకోండి: సీఐ వెంకటరెడ్డి
Krishna
కంగ్టి సీఐ వెంకటరెడ్డి ప్రజలకు లోక్ అదాలత్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆదివారం మాట్లాడుతూ, ఈ నెల 28న నారాయణఖేడ్ కోర్టులో లోక్ అదాలత్ నిర్వహించబడుతుందని తెలిపారు.సిర్గాపూర్, కల్హేర్, కంగ్జి మండలాల ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తమకు సంబంధించిన వివిధ కేసులను సులభంగా పరిష్కరించుకోవాలని కోరారు.లోక్ అదాలత్ ద్వారా యాక్సిడెంట్ కేసులు, గొడవలు, చీటింగ్, చిట్ఫండ్ వివాదాలు, చిన్నపాటి దొంగతనాలు, అక్రమ రవాణా వంటి పలు రకాల కేసుల్లో ఇరువర్గాల మధ్య రాజీ కుదుర్చుకునే అవకాశం ఉంటుందని వివరించారు. కోర్టు ప్రక్రియలతో పోలిస్తే, లోక్ అదాలత్లో వేగంగా, తక్కువ ఖర్చుతో సమస్యలకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు.అలాగే ఈ నెల 23 నుంచి 28 వరకు సంబంధిత పోలీస్ స్టేషన్లు లేదా కోర్టుకు హాజరై ఇరువర్గాలు పరస్పరం చర్చించి రాజీకి రావచ్చని తెలిపారు. ఇలాంటి అవకాశాల ద్వారా సమయం, డబ్బు ఆదా అవుతుందని, పరస్పర విభేదాలు సఖ్యతగా ముగిసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.ప్రజలు ఈ లోక్ అదాలత్ అవకాశాన్ని వినియోగించుకుని తమ కేసులను సులభంగా పరిష్కరించుకోవాలని సీఐ వెంకటరెడ్డి విజ్ఞప్తి చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి