లింగ వారి గూడెం బస్సు పునరుద్ధరణకు ఎమ్మెల్సీ ని కలిసిన యువకులు
లింగ వారి గూడెం బస్సు పునరుద్ధరణకు ఎమ్మెల్సీ ని కలిసిన యువకులు
Kathula narsimha
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం లింగ వారి గూడెం గ్రామానికి గత కొద్ది సంవత్సరాలుగా నిలిచిపోయిన ఆర్టీసీ బస్సు పునరుద్ధరణ కోసం ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యమును లింగ వారి గూడెం వార్డు మెంబర్లు యువకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి వినతి పత్రం అందజేశారు 1996 నుండి లింగ వారి గూడెంకు నార్కట్పల్లి డిపో బస్సు నడుస్తుండే నార్కట్పల్లి డిపో తీయడం వలన గ్రామానికి బస్సు బంద్ అయింది కొన్ని సంవత్సరాలు నల్గొండ డిపో బస్సు కూడా నడిచింది కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ బస్సు కూడా బంద్ కావడం వలన గ్రామ ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ సందర్భంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ఆర్టిసి ఆర్ఎం కి మాట్లాడగా వారు అనుకూలంగా స్పందించి వెంటనే బస్సును పునరుద్ధరణ చేపిస్తానని హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ జిల్లా నాయకులు పల్లె శేఖర్ రెడ్డి వార్డు మెంబరు కత్తుల మల్లయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు కత్తుల నరేష్, కత్తుల విజయ్ కుమార్, కురుమతి దేవదాస్ గ్రామస్తులు మరియు తదితరులు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి