Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 04:39 AM

లీప్ యాప్ లోపాలకు ఉపాధ్యాయులను బాధ్యుల్ని చేయొద్దు: చాట్రాయి ఎస్‌టీయూ నాయకుల ఆగ్రహం

లీప్ యాప్ లోపాలకు ఉపాధ్యాయులను బాధ్యుల్ని చేయొద్దు: చాట్రాయి ఎస్‌టీయూ నాయకుల ఆగ్రహం

లీప్ యాప్ లోపాలకు ఉపాధ్యాయులను బాధ్యుల్ని చేయొద్దు: చాట్రాయి ఎస్‌టీయూ నాయకుల ఆగ్రహం
02-03-2026 59 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చాట్రాయి, మార్చి 2: ఉపాధ్యాయుల పట్ల రాష్ట్ర విద్యాశాఖ అవలంబిస్తున్న కఠిన వైఖరిని చాట్రాయి మండలం ఎస్‌టీయూ నాయకులు సంయుక్త ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. హాజరు నమోదు కోసం ఉపయోగిస్తున్న ‘లీప్’ యాప్‌లో తరచూ సాంకేతిక లోపాలు తలెత్తుతున్నాయని వారు పేర్కొన్నారు.

ప్రత్యేకించి గ్రామీణ మండలం అయిన చాట్రాయిలో సిగ్నల్ సమస్యలు తీవ్రంగా ఉన్నప్పటికీ యాప్ పని చేయకపోవడాన్ని ఉపాధ్యాయులపై మోపడం సరికాదని ఆక్షేపించారు. సాంకేతిక లోపాలు, నెట్‌వర్క్ ఇబ్బందులు వంటి కారణాలతో హాజరు నమోదులో జాప్యం జరుగుతున్నదని, దీనిని శాఖ అధికారులు సమగ్రంగా పరిశీలించకుండా ఉపాధ్యాయులను బాధ్యుల్ని చేయడం అన్యాయమన్నారు.

విద్యాశాఖ తీరుతో ఉపాధ్యాయులు మానసిక ఆందోళనకు గురవుతున్నారని, ఈ పరిస్థితిని తక్షణమే సరిచేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. లీప్ యాప్ లోపాలను సాంకేతికంగా పరిష్కరించి, గ్రామీణ ప్రాంతాల్లో నెట్‌వర్క్ సదుపాయాలు మెరుగుపర్చాలని విజ్ఞప్తి చేశారు.

ఈ ప్రకటనపై చాట్రాయి మండల ఎస్‌టీయూ అధ్యక్షుడు జి. అమరయ్య, ప్రధాన కార్యదర్శి ఎస్. నరసింహారావు, జిల్లా ఆర్థిక కార్యదర్శి జి. రాము, రాష్ట్ర కౌన్సిలర్ ఎస్.కే. మహబు, జిల్లా అదనపు కార్యదర్శి ఎం. పుల్లారావు, జిల్లా కార్యదర్శి ఏ. విజయ భాస్కర్ సంతకాలు చేశారు.

Sthanikam

లీప్ యాప్ లోపాలకు ఉపాధ్యాయులను బాధ్యుల్ని చేయొద్దు: చాట్రాయి ఎస్‌టీయూ నాయకుల ఆగ్రహం

Article Image

చాట్రాయి, మార్చి 2: ఉపాధ్యాయుల పట్ల రాష్ట్ర విద్యాశాఖ అవలంబిస్తున్న కఠిన వైఖరిని చాట్రాయి మండలం ఎస్‌టీయూ నాయకులు సంయుక్త ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. హాజరు నమోదు కోసం ఉపయోగిస్తున్న ‘లీప్’ యాప్‌లో తరచూ సాంకేతిక లోపాలు తలెత్తుతున్నాయని వారు పేర్కొన్నారు.

ప్రత్యేకించి గ్రామీణ మండలం అయిన చాట్రాయిలో సిగ్నల్ సమస్యలు తీవ్రంగా ఉన్నప్పటికీ యాప్ పని చేయకపోవడాన్ని ఉపాధ్యాయులపై మోపడం సరికాదని ఆక్షేపించారు. సాంకేతిక లోపాలు, నెట్‌వర్క్ ఇబ్బందులు వంటి కారణాలతో హాజరు నమోదులో జాప్యం జరుగుతున్నదని, దీనిని శాఖ అధికారులు సమగ్రంగా పరిశీలించకుండా ఉపాధ్యాయులను బాధ్యుల్ని చేయడం అన్యాయమన్నారు.

విద్యాశాఖ తీరుతో ఉపాధ్యాయులు మానసిక ఆందోళనకు గురవుతున్నారని, ఈ పరిస్థితిని తక్షణమే సరిచేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. లీప్ యాప్ లోపాలను సాంకేతికంగా పరిష్కరించి, గ్రామీణ ప్రాంతాల్లో నెట్‌వర్క్ సదుపాయాలు మెరుగుపర్చాలని విజ్ఞప్తి చేశారు.

ఈ ప్రకటనపై చాట్రాయి మండల ఎస్‌టీయూ అధ్యక్షుడు జి. అమరయ్య, ప్రధాన కార్యదర్శి ఎస్. నరసింహారావు, జిల్లా ఆర్థిక కార్యదర్శి జి. రాము, రాష్ట్ర కౌన్సిలర్ ఎస్.కే. మహబు, జిల్లా అదనపు కార్యదర్శి ఎం. పుల్లారావు, జిల్లా కార్యదర్శి ఏ. విజయ భాస్కర్ సంతకాలు చేశారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News