Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 02, 2026 02:22 PM

లీప్ యాప్ లోపాలకు ఉపాధ్యాయులను బాధ్యుల్ని చేయొద్దు: చాట్రాయి ఎస్‌టీయూ నాయకుల ఆగ్రహం

లీప్ యాప్ లోపాలకు ఉపాధ్యాయులను బాధ్యుల్ని చేయొద్దు: చాట్రాయి ఎస్‌టీయూ నాయకుల ఆగ్రహం

లీప్ యాప్ లోపాలకు ఉపాధ్యాయులను బాధ్యుల్ని చేయొద్దు: చాట్రాయి ఎస్‌టీయూ నాయకుల ఆగ్రహం
March 02, 2026 12:33 PM 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చాట్రాయి, మార్చి 2: ఉపాధ్యాయుల పట్ల రాష్ట్ర విద్యాశాఖ అవలంబిస్తున్న కఠిన వైఖరిని చాట్రాయి మండలం ఎస్‌టీయూ నాయకులు సంయుక్త ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. హాజరు నమోదు కోసం ఉపయోగిస్తున్న ‘లీప్’ యాప్‌లో తరచూ సాంకేతిక లోపాలు తలెత్తుతున్నాయని వారు పేర్కొన్నారు.

ప్రత్యేకించి గ్రామీణ మండలం అయిన చాట్రాయిలో సిగ్నల్ సమస్యలు తీవ్రంగా ఉన్నప్పటికీ యాప్ పని చేయకపోవడాన్ని ఉపాధ్యాయులపై మోపడం సరికాదని ఆక్షేపించారు. సాంకేతిక లోపాలు, నెట్‌వర్క్ ఇబ్బందులు వంటి కారణాలతో హాజరు నమోదులో జాప్యం జరుగుతున్నదని, దీనిని శాఖ అధికారులు సమగ్రంగా పరిశీలించకుండా ఉపాధ్యాయులను బాధ్యుల్ని చేయడం అన్యాయమన్నారు.

విద్యాశాఖ తీరుతో ఉపాధ్యాయులు మానసిక ఆందోళనకు గురవుతున్నారని, ఈ పరిస్థితిని తక్షణమే సరిచేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. లీప్ యాప్ లోపాలను సాంకేతికంగా పరిష్కరించి, గ్రామీణ ప్రాంతాల్లో నెట్‌వర్క్ సదుపాయాలు మెరుగుపర్చాలని విజ్ఞప్తి చేశారు.

ఈ ప్రకటనపై చాట్రాయి మండల ఎస్‌టీయూ అధ్యక్షుడు జి. అమరయ్య, ప్రధాన కార్యదర్శి ఎస్. నరసింహారావు, జిల్లా ఆర్థిక కార్యదర్శి జి. రాము, రాష్ట్ర కౌన్సిలర్ ఎస్.కే. మహబు, జిల్లా అదనపు కార్యదర్శి ఎం. పుల్లారావు, జిల్లా కార్యదర్శి ఏ. విజయ భాస్కర్ సంతకాలు చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News