Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాళేశ్వరం పై కక్షసాధింపుకు బ్రేక్ – హైకోర్టు స్టేతో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ పత్తికుంటపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 24, 2026 11:55 PM

లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ:ఖేఢ్ ఎమ్మెల్యే

లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ:ఖేఢ్ ఎమ్మెల్యే

లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ:ఖేఢ్ ఎమ్మెల్యే
March 02, 2026 03:24 PM 45 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గం పరిధిలో ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు చేరేలా కృషి జరుగుతోంది. ఈ సందర్భంగా నారాయణఖేడ్ మండలంలోని అనంతసాగర్ గ్రామానికి చెందిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి మరియు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి అందజేశారు.అనంతసాగర్ గ్రామానికి చెందిన లక్ష్మీ బాయి భార్య దొండి రావు కుమార్తె వివాహం కోసం మంజూరైన కళ్యాణ లక్ష్మి పథకం చెక్కును అందజేశారు. అలాగే అదే గ్రామానికి చెందిన అరె మారుతి రావుకు వైద్య చికిత్స కోసం మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 60 వేల రూపాయల చెక్కును అందించారు.ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ఈ పథకాలు ఎంతో తోడ్పాటు అందిస్తాయని పేర్కొన్నారు. ప్రజలు ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి తెలుసుకొని అవసరమైనప్పుడు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి, మనోహర్ పాటిల్, నాగి రెడ్డి, శివ రెడ్డి, లోకేష్ రెడ్డి, మస్తాన్ సబ్ తదితర నాయకులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News