లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ:ఖేఢ్ ఎమ్మెల్యే
లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ:ఖేఢ్ ఎమ్మెల్యే
Sthanikam joint District Staff Reporter krishna
నారాయణఖేడ్ నియోజకవర్గం పరిధిలో ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు చేరేలా కృషి జరుగుతోంది. ఈ సందర్భంగా నారాయణఖేడ్ మండలంలోని అనంతసాగర్ గ్రామానికి చెందిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి మరియు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి అందజేశారు.అనంతసాగర్ గ్రామానికి చెందిన లక్ష్మీ బాయి భార్య దొండి రావు కుమార్తె వివాహం కోసం మంజూరైన కళ్యాణ లక్ష్మి పథకం చెక్కును అందజేశారు. అలాగే అదే గ్రామానికి చెందిన అరె మారుతి రావుకు వైద్య చికిత్స కోసం మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 60 వేల రూపాయల చెక్కును అందించారు.ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ఈ పథకాలు ఎంతో తోడ్పాటు అందిస్తాయని పేర్కొన్నారు. ప్రజలు ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి తెలుసుకొని అవసరమైనప్పుడు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి, మనోహర్ పాటిల్, నాగి రెడ్డి, శివ రెడ్డి, లోకేష్ రెడ్డి, మస్తాన్ సబ్ తదితర నాయకులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి