కోదాడలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం
కోదాడ మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు నిర్విరామంగా ప్రచారం నిర్వహించారు. ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పిస్తూ సాగిన ఉత్కంఠభరిత ప్రచారం సోమవారం సాయంత్రంతో ముగిసింది.
ఈ నేపథ్యంలో కోదాడ పట్టణంలోని అన్ని వార్డుల్లో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ విస్తృతంగా పర్యటించి తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు.
అదేవిధంగా 10వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి మామిడి రామారావు గెలుపే లక్ష్యంగా విస్తృత ప్రచారం నిర్వహించారు. రేపు జరగనున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా కోదాడలో ఎగరడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి