కంగ్టిలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
కంగ్టిలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి మండల కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకయ్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వారు ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ అంబేద్కర్ సేవలను స్మరించారు.అంబేద్కర్ దేశానికి గర్వకారణమని, ఆయన అందించిన రాజ్యాంగం ప్రపంచంలోనే గొప్పదని నాయకులు పేర్కొన్నారు. విద్యావంతులై, సంఘటితమై హక్కుల సాధన కోసం ముందుకు సాగాలని యువతకు పిలుపునిచ్చారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ చేసిన కృషి అపారమని, రాజ్యాంగం ద్వారా అందించిన హక్కులను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు కమిషన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు.అంబేద్కర్ దేశానికి గర్వకారణమని, ఆయన అందించిన రాజ్యాంగం ప్రపంచంలోనే గొప్పదని నాయకులు పేర్కొన్నారు. విద్యావంతులై, సంఘటితమై హక్కుల సాధన కోసం ముందుకు సాగాలని యువతకు పిలుపునిచ్చారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ చేసిన కృషి అపారమని, రాజ్యాంగం ద్వారా అందించిన హక్కులను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు కమిషన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు.అంబేద్కర్ దేశానికి గర్వకారణమని, ఆయన అందించిన రాజ్యాంగం ప్రపంచంలోనే గొప్పదని నాయకులు పేర్కొన్నారు. విద్యావంతులై, సంఘటితమై హక్కుల సాధన కోసం ముందుకు సాగాలని యువతకు పిలుపునిచ్చారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ చేసిన కృషి అపారమని, రాజ్యాంగం ద్వారా అందించిన హక్కులను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు కమిషన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు.ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, దళిత సంఘాల ప్రతినిధులు, మేధావులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని అంబేద్కర్కు ఘన నివాళులు అర్పించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి