ఖేఢ్ సబ్ కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఖేఢ్ మున్సిపల్ చైర్మన్
ఖేఢ్ సబ్ కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఖేఢ్ మున్సిపల్ చైర్మన్
Sthanikam joint District Staff Reporter krishna
నారాయణాఖేడ్ మున్సిపల్ చైర్మన్గా ఇటీవల ఎన్నికైన నాగేష్ కూమార్ షేట్కార్, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతిను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శాలువాతో సన్మానించి, పుష్పగుచ్ఛం అందజేశారు.ఈ భేటీలో మున్సిపాలిటీ అభివృద్ధి, పట్టణంలోని ప్రాధాన్య సమస్యల పరిష్కారం,మౌలిక వసతుల మెరుగుదల,పారిశుధ్యం, తాగునీటి సరఫరా, రహదారుల అభివృద్ధి వంటి ముఖ్య అంశాలపై చర్చ జరిగింది. ప్రజల ఆశలు,ఆకాంక్షలను నెరవేర్చేందుకు పరిపాలన మరియు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాల్సిన అవసరాన్ని సబ్ కలెక్టర్ ఉమా హారతి సూచించారు. పట్టణ అభివృద్ధి కోసం అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు.మున్సిపల్ చైర్మన్ నాగేష్ కూమార్ షేట్కార్ మాట్లాడుతూ, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా పారదర్శక పాలన అందిస్తామని, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తామని పేర్కొన్నారు.నారాయణఖేడ్ను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు కృషి కొనసాగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు కే. శ్రీనివాస్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తాహిర్ అలీ, స్థానిక ప్రజాప్రతినిధులు, మున్సిపల్ కౌన్సిలర్ లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమం స్నేహపూర్వక వాతావరణంలో విజయవంతంగా జరిగింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి