ఖేడ్లో కాంగ్రెస్కు భారీ షాక్ – బిఆర్ఎస్లో పెద్ద చేరికలు
ఖేడ్లో కాంగ్రెస్కు భారీ షాక్ – బిఆర్ఎస్లో పెద్ద చేరికలు
Sthanikam District Staff Reporter krishna
మున్సిపల్ ఎన్నికల సమయానికి నారాయణఖేడ్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని 7వ వార్డ్ శాస్త్రి నగర్కు చెందిన కాంగ్రెస్ నాయకులు మహేష్ రామ్ మరియు వారి అనుచరులు సుమారు 50 మంది బిఆర్ఎస్ పార్టీలో చేరారు.ఈ చేరికను మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారు గులాబీ కండువా కప్పి బిఆర్ఎస్ పార్టీలో ఆహ్వానించారు. చేరిన నేతలు మాట్లాడుతూ, 7వ వార్డ్ బిఆర్ఎస్ అభ్యర్థి విజయ బుజ్జిను అధిక మెజారిటీతో గెలిపించి, విజయం సందర్భంగా మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డికు బహుమతిగా అందిస్తామని చెప్పారు.చేరిన నేతలలో రాజ్ కుమార్, సాయిలు, అంజయ్య, నర్సింలు, శ్రీనివాస్, ప్రవీణ్, దత్తు, రాము, కృష్ణ, విటల్ మరియు వారి అనుచరులు ఉన్నారు.ఈ కార్యక్రమంలో 7వ వార్డ్ బిఆర్ఎస్ అభ్యర్థి, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విజయ బుజ్జి, పట్టణ పార్టీ అధ్యక్షులు నగేష్ సెట్, మండల సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షులు జగదీశ్వర చారి, మాజీ కౌన్సిలర్ అభిషేక్ షెత్కార్, వంశీ పటేల్, మాజీ కోఆప్షన్ సభ్యులు లయాక్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.ఈ ఘటన నారాయణఖేడ్ మున్సిపల్ ఎన్నికల పొలిటికల్ పరిస్థితులను మరింత ఉత్కంఠకరంగా మార్చినట్లయింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి