Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 26, 2026 04:53 AM

ఖేడ్‌లో బీజేపీ ఘన విజయం – 142 ఓట్ల మెజారిటీతో పత్రి లలిత రామకృష్ణ సత్తా చాటారు

ఖేడ్‌లో బీజేపీ ఘన విజయం – 142 ఓట్ల మెజారిటీతో పత్రి లలిత రామకృష్ణ సత్తా చాటారు

ఖేడ్‌లో బీజేపీ ఘన విజయం – 142 ఓట్ల మెజారిటీతో పత్రి లలిత రామకృష్ణ సత్తా చాటారు
February 14, 2026 10:18 AM 72 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sangareddy & Manoor
Sthanikam joint District Staff Reporter krishna

నారాయణఖేడ్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పత్రి లలిత రామకృష్ణ ఘన విజయం సాధించారు. 1వ వార్డులో జరిగిన పోటీలో ఆయన తన సమీప ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ అభ్యర్థిపై 142 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించడం విశేషం. ప్రారంభం నుంచే ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోటీ చివరికి బీజేపీ శ్రేణులకు ఆనందాన్ని తీసుకొచ్చింది.ఈ విజయంతో బీజేపీ నాయకులు,కార్యకర్తల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. ఫలితాలు వెల్లడైన వెంటనే పార్టీ శ్రేణులు బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచుతూ సంబరాలు జరుపుకున్నారు. స్థానిక ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని అభినందనలు తెలిపారు. వార్డు ప్రజలు అభివృద్ధి, పారదర్శక పాలనకు ప్రాధాన్యత ఇస్తూ ఇచ్చిన తీర్పుగా ఈ విజయాన్ని పార్టీ నాయకులు అభివర్ణించారు.విజయం అనంతరం స్పందించిన పత్రి లలిత రామకృష్ణ తనపై విశ్వాసం ఉంచి ఓటు వేసిన ప్రతి ఓటరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కట్టుబడి ఉంటానని, 1వ వార్డు సమగ్ర అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలను ప్రాధాన్యంగా తీసుకుని పారదర్శకంగా పనిచేస్తానని తెలిపారు.ఈ ఫలితం స్థానిక రాజకీయాల్లో కీలక మార్పుకు నాంది పలికిందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News