ఖేడ్ గడ్డ సంగమేశ్వర ఆలయంలో గుఱ్ఱపు మచ్చేందర్ ప్రత్యేక పూజలు
ఖేడ్ గడ్డ సంగమేశ్వర ఆలయంలో గుఱ్ఱపు మచ్చేందర్ ప్రత్యేక పూజలు
Sthanikam joint District Staff Reporter krishna
నారాయణఖేడ్ పట్టణ పరిధిలో ప్రసిద్ధి చెందిన గడ్డ సంగమేశ్వర ఆలయను జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు గుఱ్ఱపు మచ్చేందర్ దర్శించుకుని ప్రత్యేక పూజల్లో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలోకి చేరుకున్న వెంటనే దేవస్థాన అర్చకులు వేదమంత్రాల నడుమ పూర్ణకుంభ స్వాగతం పలికి ఆహ్వానించారు. అనంతరం స్వామివారికి అభిషేకం, అర్చనలు నిర్వహించి తీర్థప్రసాదాలను అందజేశారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మచ్చేందర్కు ఆశీర్వచనాలు అందజేసి, ప్రాంత ప్రజల ఆయురారోగ్యాలు, శాంతి, సౌభాగ్యం, సస్యశ్యామలత్వం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆలయ అభివృద్ధి, పరిసర ప్రాంతాల పురోభివృద్ధి కోసం తాను ఎల్లప్పుడూ సహకారం అందిస్తానని మచ్చేందర్ తెలిపారు. భక్తుల సౌకర్యార్థం అవసరమైన వసతుల ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీకాంత్, రమేష్ పటేల్, యువ నాయకులు సందీప్, నమిల్ల హనుమన్లు, సంగమేశ్వర్, సతీష్, రామన్న, ఉమేష్ తదితరులు పాల్గొన్నారు. స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరై మచ్చేందర్కు ఘన స్వాగతం పలికి అభినందనలు తెలిపారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడగా ఆధ్యాత్మిక

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి