ఖేడ్ అభివృద్ధికి ప్రత్యేక దృష్టి… మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని కలిసిన ఎమ్మెల్యే సంజీవరెడ్డి
ఖేడ్ అభివృద్ధికి ప్రత్యేక దృష్టి… మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని కలిసిన ఎమ్మెల్యే సంజీవరెడ్డి
Sthanikam joint District Staff Reporter krishna
నారాయణఖేడ్ నియోజకవర్గంలో కొనసాగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన నిధుల మంజూరు కోసం నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పి సంజీవరెడ్డి తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మరియు ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న పలు అభివృద్ధి పనులు, ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల ఏర్పాట్లు,రహదారులు,డ్రైనేజీలు,తాగునీటి సదుపాయాలు వంటి అంశాల గురించి మంత్రి వారికి ఎమ్మెల్యే వివరించారు.ప్రజలకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి అవసరమైన నిధులను విడుదల చేయాలని కోరారు.ఎమ్మెల్యే చేసిన వినతిపై మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి సానుకూలంగా స్పందిస్తూ నారాయణఖేడ్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని తెలిపారు. పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయడానికి అవసరమైన నిధుల మంజూరుకు తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి తన ప్రధాన లక్ష్యమని, ప్రజలకు అవసరమైన ప్రతి అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి