ఖేడ్ 1వ వార్డు మున్సిపాలిటీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని సన్మానించిన:ఖేడ్ మాజీ ఎమ్మెల్యే
ఖేడ్ 1వ వార్డు మున్సిపాలిటీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని సన్మానించిన:ఖేడ్ మాజీ ఎమ్మెల్యే
Sthanikam joint District Staff Reporter krishna
నారాయణఖేడ్ పట్టణ మున్సిపాలిటీ ఎన్నికల్లో 1వ వార్డు నుండి భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేసిన పత్రి లలితా రామకృష్ణ ఘన విజయాన్ని సాధించారు. ప్రజల ఆశీస్సులు, విశ్వాసం మరియు మద్దతుతో ఈ విజయాన్ని సొంతం చేసుకోవడం గర్వకారణమని భావిస్తున్నారు.ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు విజయ్ పాల్ రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వార్డు అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ప్రజల సమస్యలను దగ్గరగా తెలుసుకుని వాటి పరిష్కారానికి కట్టుబడి పని చేయాలని సూచించారు.లలితా రామకృష్ణ ఈ విజయంతో 1వ వార్డు ప్రజలకు మరింత సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతారని తెలిపారు.తాగునీరు, పారిశుధ్యం, రహదారులు, వెలుగుదీపాలు మరియు ఇతర మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజలకు అందుబాటులో ఉండే ప్రజాప్రతినిధిగా నిలవాలని ఆకాంక్షించారు.ఈ విజయం
భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు వార్డు ప్రజల సమిష్టి కృషి ఫలితమని పేర్కొన్నారు. ఎన్నికల్లో మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు.నారాయణఖేడ్ పట్టణ అభివృద్ధి కోసం ప్రజల సహకారంతో మరింత సేవలు అందించాలని ఆకాంక్షిస్తూ మరోసారి అభినందనలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి