Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఏబీవీపీ ఆధ్వర్యంలో చౌటుప్పల్‌లో విద్యాసంస్థల బంద్ సక్సెస్! కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 24, 2026 11:54 AM

కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ అనురాగ్ జయంతి

కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ అనురాగ్ జయంతి

కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ అనురాగ్ జయంతి
March 01, 2026 06:20 PM 32 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అనురాగ్ జయంతి శనివారం పోచంపల్లి మండలం జలాల్‌పూర్‌లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంను సందర్శించి పాఠశాల నిర్వహణపై సమగ్రంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా డార్మిటరీ, స్టోర్‌రూమ్, కిచెన్, తరగతి గదులను తనిఖీ చేసి విద్యార్థినులకు మెనూ ప్రకారం భోజనం అందుతున్నదా అని స్వయంగా బాలికలను అడిగి తెలుసుకున్నారు. వంటకు అవసరమైన సరుకులు, సామాగ్రిని పరిశీలించి నాణ్యతపై అధికారులు దృష్టి పెట్టాలని సూచించారు.

9వ మరియు 11వ తరగతి గదులను సందర్శించిన కలెక్టర్ విద్యార్థులతో ముచ్చటించి, లక్ష్యసాధన కోసం క్రమశిక్షణతో చదువుకోవాలని ప్రోత్సహించారు. తమ జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలంటే విద్యనే ప్రధాన ఆయుధంగా భావించాలని బాలికలకు సూచించారు.

పాఠశాల పరిసరాలను పరిశీలించిన ఆయన ఖాళీ ప్రదేశాలను శుభ్రపరచి విద్యార్థినులు ఆటలు ఆడుకునేందుకు ప్లేగ్రౌండ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ ఇందిరా, పోచంపల్లి ఎమ్మార్వో శ్రీనివాస్ రెడ్డి మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News