Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాళేశ్వరం పై కక్షసాధింపుకు బ్రేక్ – హైకోర్టు స్టేతో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ పత్తికుంటపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 25, 2026 01:15 AM

కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ అనురాగ్ జయంతి

కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ అనురాగ్ జయంతి

కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ అనురాగ్ జయంతి
March 01, 2026 06:20 PM 28 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అనురాగ్ జయంతి శనివారం పోచంపల్లి మండలం జలాల్‌పూర్‌లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంను సందర్శించి పాఠశాల నిర్వహణపై సమగ్రంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా డార్మిటరీ, స్టోర్‌రూమ్, కిచెన్, తరగతి గదులను తనిఖీ చేసి విద్యార్థినులకు మెనూ ప్రకారం భోజనం అందుతున్నదా అని స్వయంగా బాలికలను అడిగి తెలుసుకున్నారు. వంటకు అవసరమైన సరుకులు, సామాగ్రిని పరిశీలించి నాణ్యతపై అధికారులు దృష్టి పెట్టాలని సూచించారు.

9వ మరియు 11వ తరగతి గదులను సందర్శించిన కలెక్టర్ విద్యార్థులతో ముచ్చటించి, లక్ష్యసాధన కోసం క్రమశిక్షణతో చదువుకోవాలని ప్రోత్సహించారు. తమ జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలంటే విద్యనే ప్రధాన ఆయుధంగా భావించాలని బాలికలకు సూచించారు.

పాఠశాల పరిసరాలను పరిశీలించిన ఆయన ఖాళీ ప్రదేశాలను శుభ్రపరచి విద్యార్థినులు ఆటలు ఆడుకునేందుకు ప్లేగ్రౌండ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ ఇందిరా, పోచంపల్లి ఎమ్మార్వో శ్రీనివాస్ రెడ్డి మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News