కేజీబీవీ న్యాల్కల్ సిఆర్టి అనితకు ఆర్థిక సహాయం అందజేత
కేజీబీవీ న్యాల్కల్ సిఆర్టి అనితకు ఆర్థిక సహాయం అందజేత
Krishna
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ కేజీబీవీలో పనిచేసిన భౌతిక శాస్త్ర సిఆర్టి కే. అనిత ఇటీవల మృతిచెందగా, ఆమె కుటుంబానికి టీఎస్ యుటిఎఫ్ సంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల విరాళాల ద్వారా రూ.1,30,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా సంగారెడ్డిలోని కేకే భవన్లో నిర్వహించిన సంస్మరణ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ. వెంకట్ మాట్లాడుతూ, నైట్ డ్యూటీలో ఉండగా అనిత అకస్మాత్తుగా స్పృహ కోల్పోయి చికిత్స పొందుతూ మరణించడం బాధాకరమని పేర్కొన్నారు. ఆమె కుటుంబానికి ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా సహాయం చేయడం అభినందనీయమన్నారు. దశాబ్దాలుగా సేవలందిస్తున్న కేజీబీవీ ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రత లేకపోవడం, కనీస వేతనాలు అందకపోవడం, మరణించినప్పుడు ప్రభుత్వ సహాయం లేకపోవడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కేజీబీవీ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా, రూ.20 వేల అంత్యక్రియల ఖర్చులు, బేసిక్ పే, ఉద్యోగ భద్రత కల్పించాలని, హెల్త్ కార్డులు ఇచ్చి ఉచిత వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర, జిల్లా నాయకులు, కేజీబీవీ ఉపాధ్యాయులు మరియు అనిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి