Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
భాల్కిలో ఘనంగా గురువుల స్మరణోత్సవాలు – ఎంపీ ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 22, 2026 08:59 PM

క్యాన్సర్‌పై అవగాహన పెంపు కోసం వాల్ పోస్టర్ ఆవిష్కరించిన:మంత్రి

క్యాన్సర్‌పై అవగాహన పెంపు కోసం వాల్ పోస్టర్ ఆవిష్కరించిన:మంత్రి

క్యాన్సర్‌పై అవగాహన పెంపు కోసం వాల్ పోస్టర్ ఆవిష్కరించిన:మంత్రి
April 22, 2026 07:14 PM 48 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరాబాదులోని తన నివాసంలో గ్రేస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్యాన్సర్ నివారణ, అవగాహన కార్యక్రమాలపై వివరాలు తెలుసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 130 దేశాల్లో చేపడుతున్న “వరల్డ్ లార్జెస్ట్ క్యాన్సర్ అవగాహన డ్రైవ్ రన్” కార్యక్రమం గురించి నిర్వాహకులు మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా అవగాహన పెంపు కోసం రూపొందించిన వాల్ పోస్టర్‌ను మంత్రి ఆవిష్కరించారు.అలాగే “గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ రన్”ను 2026 అక్టోబర్ 11న హైదరాబాదులోని గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. గత సంవత్సరం ఈ రన్‌లో గచ్చిబౌలి స్టేడియంలో సుమారు 35 వేల మంది పాల్గొనగా, ప్రపంచవ్యాప్తంగా 130 దేశాల్లో దాదాపు 3 లక్షల మందికి పైగా పాల్గొన్నారని నిర్వాహకులు వెల్లడించారు. క్యాన్సర్ అవగాహన కోసం ప్రపంచవ్యాప్తంగా చేపడుతున్న ఈ కార్యక్రమాలను మంత్రి అభినందించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో క్యాన్సర్ నివారణ, అవగాహనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా క్యాన్సర్ స్క్రీనింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి అనుమానితులకు పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అన్ని జిల్లాల ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్యాన్సర్ డే కేర్ సెంటర్లు, కీమోథెరపీ సేవలను అందుబాటులో ఉంచామని చెప్పారు. క్యాన్సర్ బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఎం.ఎన్.జే క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్, నిమ్స్ ఆసుపత్రుల్లో అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ సేవలు అందిస్తున్నామని వివరించారు.ఈ కార్యక్రమంలో గ్రేస్ ఫౌండేషన్ సీఈవో డాక్టర్ చిన్నబాబు సుంకవల్లి, యశోద ఆసుపత్రి ప్రతినిధి డాక్టర్ సాయి కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News