Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డ్రోన్‌తో జెండా ఎగరవేసిన జెట్టి శివప్రసాద్ వివేకానంద పాఠశాల 10వ వార్షికోత్సవం ఘనంగా అలరించిన చిన్నారుల నృత్యాలు – గురువులే విద్యార్థుల భవితకు మార్గదర్శకులు అంబేడ్కర్: పుస్తకాలలో కాదు, ప్రస్తుత సమాజంలో పునర్జన్మ పొందాల్సిన ఆలోచన” హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం.. కోర్టుల కంటే మీరే ఎక్కువా..? సన్‌రైజర్స్ 'ఉపేషారు'.. కుర్రాళ్ల దెబ్బకు రాజస్థాన్ విలవిల! కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 15, 2026 12:22 AM

కష్టానికి ఫలితం… 992 మార్కులతో శ్రీసంహిత విజయగాధ

కష్టానికి ఫలితం… 992 మార్కులతో శ్రీసంహిత విజయగాధ

కష్టానికి ఫలితం… 992 మార్కులతో శ్రీసంహిత విజయగాధ
April 14, 2026 08:27 PM 66 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గం మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డుకు చెందిన ఉపాధ్యాయుడు డాక్టర్ వడ్ల రాజయ్య ఆచార్య కుమార్తె శ్రీసంహిత ఇంటర్ ఫలితాలలో 1000 మార్కులకు గాను 992 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 5వ స్థానం, తాలూకా స్థాయిలో ప్రథమ స్థానం సాధించి ప్రతిభ చాటుకుంది. ఈ విజయంతో కుటుంబ సభ్యులు, బంధువులు, ప్రాంత ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా 9వ వార్డు కౌన్సిలర్ బాణపురం రాజు ముదిరాజ్, 5వ వార్డు కౌన్సిలర్ మహేష్ చవాన్, శివచరణ్ లాల్ తదితరులు కలిసి శ్రీసంహితను అభినందించి స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. కష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చని శ్రీసంహిత నిరూపించిందని వారు పేర్కొంటూ, ఈ విజయం నారాయణఖేడ్ ప్రాంతానికి గర్వకారణమని, ఆమె భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News