నారాయణఖేడ్ నియోజకవర్గం మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డుకు చెందిన ఉపాధ్యాయుడు డాక్టర్ వడ్ల రాజయ్య ఆచార్య కుమార్తె శ్రీసంహిత ఇంటర్ ఫలితాలలో 1000 మార్కులకు గాను 992 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 5వ స్థానం, తాలూకా స్థాయిలో ప్రథమ స్థానం సాధించి ప్రతిభ చాటుకుంది. ఈ విజయంతో కుటుంబ సభ్యులు, బంధువులు, ప్రాంత ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా 9వ వార్డు కౌన్సిలర్ బాణపురం రాజు ముదిరాజ్, 5వ వార్డు కౌన్సిలర్ మహేష్ చవాన్, శివచరణ్ లాల్ తదితరులు కలిసి శ్రీసంహితను అభినందించి స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. కష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చని శ్రీసంహిత నిరూపించిందని వారు పేర్కొంటూ, ఈ విజయం నారాయణఖేడ్ ప్రాంతానికి గర్వకారణమని, ఆమె భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.
PRINT TIME: August 07, 2026 01:11 AM
కష్టానికి ఫలితం… 992 మార్కులతో శ్రీసంహిత విజయగాధ
కష్టానికి ఫలితం… 992 మార్కులతో శ్రీసంహిత విజయగాధ
14-04-2026
138 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గం మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డుకు చెందిన ఉపాధ్యాయుడు డాక్టర్ వడ్ల రాజయ్య ఆచార్య కుమార్తె శ్రీసంహిత ఇంటర్ ఫలితాలలో 1000 మార్కులకు గాను 992 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 5వ స్థానం, తాలూకా స్థాయిలో ప్రథమ స్థానం సాధించి ప్రతిభ చాటుకుంది. ఈ విజయంతో కుటుంబ సభ్యులు, బంధువులు, ప్రాంత ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా 9వ వార్డు కౌన్సిలర్ బాణపురం రాజు ముదిరాజ్, 5వ వార్డు కౌన్సిలర్ మహేష్ చవాన్, శివచరణ్ లాల్ తదితరులు కలిసి శ్రీసంహితను అభినందించి స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. కష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చని శ్రీసంహిత నిరూపించిందని వారు పేర్కొంటూ, ఈ విజయం నారాయణఖేడ్ ప్రాంతానికి గర్వకారణమని, ఆమె భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి