Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జయశంకర్ జయంతి... ఎన్జీలో ఘనస్మృతి తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 07, 2026 01:11 AM

కార్మికుల పక్షాన బీజేపీ – నిరసనకు మాజీ ఎమ్మెల్యే మద్దతు

కార్మికుల పక్షాన బీజేపీ – నిరసనకు మాజీ ఎమ్మెల్యే మద్దతు

కార్మికుల పక్షాన బీజేపీ – నిరసనకు మాజీ ఎమ్మెల్యే మద్దతు
24-04-2026 59 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ పట్టణంలోని ఆర్‌టీసీ డిపో వద్ద గత మూడు రోజులుగా ఆర్టీసీ కార్మిక సోదర సోదరీమణులు చేపడుతున్న నిరసన కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ తరపున సంఘీభావం తెలిపినట్లు మాజీ శాసన సభ్యులు విజయపాల్ రెడ్డి తెలిపారు.తెలంగాణ సాధన ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల పాత్ర ఎంతో గొప్పదని గుర్తుచేస్తూ, రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న కార్మికులు నేడు తమ హక్కుల కోసం నిరసనకు దిగాల్సి రావడం బాధాకరమన్నారు. గత ప్రభుత్వం గానీ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గానీ ఆర్‌టీసీ కార్మికుల సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించడంలో విఫలమయ్యాయని విమర్శించారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించి వారికి తగిన వేతనాలు, ఉద్యోగ భద్రత, ఇతర హక్కులు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజలకు నిత్యం సేవలు అందిస్తున్న ఆర్‌టీసీ కార్మికులను నిర్లక్ష్యం చేయడం సరికాదని పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి కార్మికులతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించకపోతే భవిష్యత్తులో ఉద్యమాలు మరింత ఉధృతం అవుతాయని హెచ్చరించారు. భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ కార్మికుల పక్షాన నిలుస్తుందని తెలిపారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ మద్దతును తెలియజేశారు.

Sthanikam

కార్మికుల పక్షాన బీజేపీ – నిరసనకు మాజీ ఎమ్మెల్యే మద్దతు

Article Image

నారాయణఖేడ్ పట్టణంలోని ఆర్‌టీసీ డిపో వద్ద గత మూడు రోజులుగా ఆర్టీసీ కార్మిక సోదర సోదరీమణులు చేపడుతున్న నిరసన కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ తరపున సంఘీభావం తెలిపినట్లు మాజీ శాసన సభ్యులు విజయపాల్ రెడ్డి తెలిపారు.తెలంగాణ సాధన ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల పాత్ర ఎంతో గొప్పదని గుర్తుచేస్తూ, రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న కార్మికులు నేడు తమ హక్కుల కోసం నిరసనకు దిగాల్సి రావడం బాధాకరమన్నారు. గత ప్రభుత్వం గానీ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గానీ ఆర్‌టీసీ కార్మికుల సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించడంలో విఫలమయ్యాయని విమర్శించారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించి వారికి తగిన వేతనాలు, ఉద్యోగ భద్రత, ఇతర హక్కులు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజలకు నిత్యం సేవలు అందిస్తున్న ఆర్‌టీసీ కార్మికులను నిర్లక్ష్యం చేయడం సరికాదని పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి కార్మికులతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించకపోతే భవిష్యత్తులో ఉద్యమాలు మరింత ఉధృతం అవుతాయని హెచ్చరించారు. భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ కార్మికుల పక్షాన నిలుస్తుందని తెలిపారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ మద్దతును తెలియజేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News