కార్మిక హక్కుల కోసం పోరాటం – సీఐటీయూ చుక్క గుర్తుపై ఓటు వేయండి
కార్మిక హక్కుల కోసం పోరాటం – సీఐటీయూ చుక్క గుర్తుపై ఓటు వేయండి
Krishna
సంగారెడ్డి జిల్లాలోని ఎంఆర్ఎఫ్ అంకనపల్లి పరిశ్రమలో యూనియన్ గుర్తింపు వెరిఫికేషన్ ఎన్నికలు రేపు జరగనున్నాయి. ఈ సందర్భంగా సీఐటీయూ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించగా, రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రాములు హాజరై కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రంలో కార్మిక హక్కులు, సంక్షేమం కోసం నిజంగా పోరాడుతున్న సంఘం సీఐటీయూనేనని ఆయన తెలిపారు. గతంలో ఒప్పందాలు కుదుర్చుకున్న కొన్ని సంఘాలు కార్మికులను నిరాశపరిచాయని విమర్శించారు. సీఐటీయూ సమిష్టి నాయకత్వంతో కార్మికులకు చారిత్రాత్మక వేతన ఒప్పందం, మెరుగైన సౌకర్యాలు, ఉద్యోగ భద్రత సాధించగలదని పేర్కొన్నారు.యజమాన్యం ఎన్నికలను అడ్డుకునే ప్రయత్నాలను కార్మికుల ఐక్యతతో ఎదుర్కొన్నామని, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించడం ప్రతి కార్మిక సంఘానికి హక్కు అని అన్నారు. కార్మిక సంఘాల ఎన్నికల్లో యాజమాన్యం జోక్యం తగదని స్పష్టం చేశారు. రేపు జరిగే ఎన్నికల్లో సీఐటీయూ గుర్తు “చుక్క”పై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీర మల్లేశం, జే మల్లికార్జున్, వి ప్రవీణ్ కుమార్, సాయిలు, మాణిక్యం, రాజయ్య, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి