Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జయశంకర్ జయంతి... ఎన్జీలో ఘనస్మృతి తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 07, 2026 03:11 AM

కాన్షీరాం ఆశయాలతో బహుజన సమాజం ముందుకు సాగాలి

కాన్షీరాం ఆశయాలతో బహుజన సమాజం ముందుకు సాగాలి

కాన్షీరాం ఆశయాలతో బహుజన సమాజం ముందుకు సాగాలి
15-03-2026 89 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

బహుజన ఉద్యమ పితామహుడు మన్యశ్రీ కాన్షీరాం జయంతి సందర్భంగా నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. నారాయణఖేడ్ నియోజకవర్గ అధ్యక్షులు అనుముల తుకారం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షులు బోర్గి భీమన్న ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బహుజన సమాజం దేశంలో పెద్ద శాతం ఉన్నప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో రాజకీయ అధికారాన్ని సాధించలేకపోతున్న పరిస్థితి ఉందన్నారు. బహుజనులందరూ ఐక్యంగా ఉండి తమ హక్కుల కోసం పోరాడితేనే నిజమైన సామాజిక న్యాయం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. మహనీయుడు కాన్షీరాం చూపిన మార్గంలో నడుస్తూ బహుజన సమాజ అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.కాన్షీరాం తన జీవితాన్ని మొత్తం బహుజనుల సంక్షేమం, సామాజిక సమానత్వం కోసం అంకితం చేసిన మహనీయుడని నాయకులు కొనియాడారు. ఆయన ఆలోచనలు, ఆశయాలు నేటి తరానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని తెలిపారు. బహుజన సమాజం ఐక్యంగా ఉంటేనే సమాజంలో సమానత్వం మరియు న్యాయం స్థిరపడుతాయని అన్నారు.ఈ కార్యక్రమంలో బీఎస్పీ నారాయణఖేడ్ ఉపాధ్యక్షులు మైత్రి సాయిలు, అంబేద్కర్ భవనం ఇంచార్జ్ బీమాసేన, దళిత నాయకులు ప్రదీప్, రజక సంఘం జిల్లా అధ్యక్షులు ప్రశాంత్ తదితర నాయకులు, కార్యకర్తలు మరియు బహుజన సమాజ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాన్షీరాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

Sthanikam

కాన్షీరాం ఆశయాలతో బహుజన సమాజం ముందుకు సాగాలి

Article Image

బహుజన ఉద్యమ పితామహుడు మన్యశ్రీ కాన్షీరాం జయంతి సందర్భంగా నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. నారాయణఖేడ్ నియోజకవర్గ అధ్యక్షులు అనుముల తుకారం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షులు బోర్గి భీమన్న ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బహుజన సమాజం దేశంలో పెద్ద శాతం ఉన్నప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో రాజకీయ అధికారాన్ని సాధించలేకపోతున్న పరిస్థితి ఉందన్నారు. బహుజనులందరూ ఐక్యంగా ఉండి తమ హక్కుల కోసం పోరాడితేనే నిజమైన సామాజిక న్యాయం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. మహనీయుడు కాన్షీరాం చూపిన మార్గంలో నడుస్తూ బహుజన సమాజ అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.కాన్షీరాం తన జీవితాన్ని మొత్తం బహుజనుల సంక్షేమం, సామాజిక సమానత్వం కోసం అంకితం చేసిన మహనీయుడని నాయకులు కొనియాడారు. ఆయన ఆలోచనలు, ఆశయాలు నేటి తరానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని తెలిపారు. బహుజన సమాజం ఐక్యంగా ఉంటేనే సమాజంలో సమానత్వం మరియు న్యాయం స్థిరపడుతాయని అన్నారు.ఈ కార్యక్రమంలో బీఎస్పీ నారాయణఖేడ్ ఉపాధ్యక్షులు మైత్రి సాయిలు, అంబేద్కర్ భవనం ఇంచార్జ్ బీమాసేన, దళిత నాయకులు ప్రదీప్, రజక సంఘం జిల్లా అధ్యక్షులు ప్రశాంత్ తదితర నాయకులు, కార్యకర్తలు మరియు బహుజన సమాజ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాన్షీరాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News