Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 05:49 AM

కన్నుల పండుగగా శ్రీ తిరుమలనాథ స్వామి రథోత్సవం

కన్నుల పండుగగా శ్రీ తిరుమలనాథ స్వామి రథోత్సవం

కన్నుల పండుగగా శ్రీ తిరుమలనాథ స్వామి రథోత్సవం
27-02-2026 66 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

పెద్దకాపర్తి గుట్టపై భక్తి పారవశ్యం… భారీగా తరలివచ్చిన భక్తులు

చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో ప్రతి సంవత్సరం మూడు రోజుల పాటు వైభవంగా నిర్వహించే శ్రీ తిరుమలనాథ స్వామి జాతరలో భాగంగా శుక్రవారం గుట్టపై నిర్వహించిన రథోత్సవం కన్నుల పండుగగా సాగింది. గ్రామ దేవస్థాన పరిసరాలు భక్తుల సందడితో కళకళలాడాయి. స్వామివారి రథాన్ని గ్రామ పెద్దలు, యువకులు భక్తి శ్రద్ధలతో లాగుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

వేద మంత్రోచ్చారణల మధ్య ప్రారంభమైన రథోత్సవం ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పింది. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. మహిళలు సంప్రదాయ వేషధారణలో పాల్గొని కార్యక్రమానికి మరింత శోభను చేకూర్చారు.జాతర విజయవంతానికి సహకరించిన దాతలకు నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో చైర్మన్ ఓర్సు రాజు, సర్పంచ్ కాటం వెంకటేష్, మాజీ సర్పంచ్ మర్రి జలంధర్ రెడ్డి, చేకూరి గణేష్, నీలకంఠం లింగస్వామి, ఆవుల జానయ్య, నీలకంఠ నరేష్, ఆవుల రాము, మోర రామరాజు, ఏర్పుల నరసింహ, నూతి తిరుమలేష్, ఎదుల అజిత్ రెడ్డి, ఆనగంటి నరేష్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.మూడు రోజులపాటు జరుగనున్న జాతరలో భక్తులకు అన్నదాన కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గ్రామీణ ప్రాంతంలో ఇలాంటి ఆధ్యాత్మిక వేడుకలు సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనమని పెద్దలు అభిప్రాయపడ్డారు.

Sthanikam

కన్నుల పండుగగా శ్రీ తిరుమలనాథ స్వామి రథోత్సవం

Article Image

పెద్దకాపర్తి గుట్టపై భక్తి పారవశ్యం… భారీగా తరలివచ్చిన భక్తులు

చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో ప్రతి సంవత్సరం మూడు రోజుల పాటు వైభవంగా నిర్వహించే శ్రీ తిరుమలనాథ స్వామి జాతరలో భాగంగా శుక్రవారం గుట్టపై నిర్వహించిన రథోత్సవం కన్నుల పండుగగా సాగింది. గ్రామ దేవస్థాన పరిసరాలు భక్తుల సందడితో కళకళలాడాయి. స్వామివారి రథాన్ని గ్రామ పెద్దలు, యువకులు భక్తి శ్రద్ధలతో లాగుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

వేద మంత్రోచ్చారణల మధ్య ప్రారంభమైన రథోత్సవం ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పింది. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. మహిళలు సంప్రదాయ వేషధారణలో పాల్గొని కార్యక్రమానికి మరింత శోభను చేకూర్చారు.జాతర విజయవంతానికి సహకరించిన దాతలకు నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో చైర్మన్ ఓర్సు రాజు, సర్పంచ్ కాటం వెంకటేష్, మాజీ సర్పంచ్ మర్రి జలంధర్ రెడ్డి, చేకూరి గణేష్, నీలకంఠం లింగస్వామి, ఆవుల జానయ్య, నీలకంఠ నరేష్, ఆవుల రాము, మోర రామరాజు, ఏర్పుల నరసింహ, నూతి తిరుమలేష్, ఎదుల అజిత్ రెడ్డి, ఆనగంటి నరేష్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.మూడు రోజులపాటు జరుగనున్న జాతరలో భక్తులకు అన్నదాన కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గ్రామీణ ప్రాంతంలో ఇలాంటి ఆధ్యాత్మిక వేడుకలు సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనమని పెద్దలు అభిప్రాయపడ్డారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News