Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జయశంకర్ జయంతి... ఎన్జీలో ఘనస్మృతి తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 07, 2026 02:22 AM

కాలనీల్లో కలెక్టర్ పర్యటన – ఇందిరమ్మ ఇళ్లపై స్పష్టమైన అవగాహన

కాలనీల్లో కలెక్టర్ పర్యటన – ఇందిరమ్మ ఇళ్లపై స్పష్టమైన అవగాహన

కాలనీల్లో కలెక్టర్ పర్యటన – ఇందిరమ్మ ఇళ్లపై స్పష్టమైన అవగాహన
10-04-2026 50 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా జిహెచ్ఎంసి పరిధిలోని ఆర్సిపురం మండలం మార్క్స్ నగర్, ఇక్రిశాట్ కాలనీలలో శుక్రవారం జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య హౌసింగ్ అధికారులతో కలిసి పర్యటించి కాలనీవాసులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై అవగాహన కల్పిస్తూ, జీ ప్లస్ 5 విధానంలో ఆధునిక సౌకర్యాలతో ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అర్హులైన వారు స్వచ్ఛందంగా ముందుకు రావాలని సూచించారు. ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. కాలనీవాసులు కూడా సానుకూలంగా స్పందిస్తూ ఇళ్ల నిర్మాణానికి ముందుకు వస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్సిపురం తహసీల్దార్, హౌసింగ్ శాఖ అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Sthanikam

కాలనీల్లో కలెక్టర్ పర్యటన – ఇందిరమ్మ ఇళ్లపై స్పష్టమైన అవగాహన

Article Image

సంగారెడ్డి జిల్లా జిహెచ్ఎంసి పరిధిలోని ఆర్సిపురం మండలం మార్క్స్ నగర్, ఇక్రిశాట్ కాలనీలలో శుక్రవారం జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య హౌసింగ్ అధికారులతో కలిసి పర్యటించి కాలనీవాసులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై అవగాహన కల్పిస్తూ, జీ ప్లస్ 5 విధానంలో ఆధునిక సౌకర్యాలతో ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అర్హులైన వారు స్వచ్ఛందంగా ముందుకు రావాలని సూచించారు. ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. కాలనీవాసులు కూడా సానుకూలంగా స్పందిస్తూ ఇళ్ల నిర్మాణానికి ముందుకు వస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్సిపురం తహసీల్దార్, హౌసింగ్ శాఖ అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News