PRINT TIME: April 10, 2026 10:08 PM
కాలనీల్లో కలెక్టర్ పర్యటన – ఇందిరమ్మ ఇళ్లపై స్పష్టమైన అవగాహన
కాలనీల్లో కలెక్టర్ పర్యటన – ఇందిరమ్మ ఇళ్లపై స్పష్టమైన అవగాహన
April 10, 2026 08:19 PM
19 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
సంగారెడ్డి జిల్లా జిహెచ్ఎంసి పరిధిలోని ఆర్సిపురం మండలం మార్క్స్ నగర్, ఇక్రిశాట్ కాలనీలలో శుక్రవారం జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య హౌసింగ్ అధికారులతో కలిసి పర్యటించి కాలనీవాసులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై అవగాహన కల్పిస్తూ, జీ ప్లస్ 5 విధానంలో ఆధునిక సౌకర్యాలతో ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అర్హులైన వారు స్వచ్ఛందంగా ముందుకు రావాలని సూచించారు. ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. కాలనీవాసులు కూడా సానుకూలంగా స్పందిస్తూ ఇళ్ల నిర్మాణానికి ముందుకు వస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్సిపురం తహసీల్దార్, హౌసింగ్ శాఖ అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి