Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నిజాయితీకి నిదర్శనం సెక్యూరిటీ సిబ్బంది మరిచిపోయిన మొబైల్‌ను భక్తునికి అప్పగింపు ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ “అంధకారంలో వెలుగైన మహనీయుడు: అంబేద్కర్ చూపిన సమానత్వ దారి” – డి.డి. దాస్ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం.. కోర్టుల కంటే మీరే ఎక్కువా..? సన్‌రైజర్స్ 'ఉపేషారు'.. కుర్రాళ్ల దెబ్బకు రాజస్థాన్ విలవిల! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 16, 2026 06:39 PM

కల్హేర్ మండలంలో అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష

కల్హేర్ మండలంలో అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష

కల్హేర్ మండలంలో అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష
April 16, 2026 04:18 PM 18 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

కల్హేర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మండల స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి పాల్గొని మండలంలోని అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మండలానికి చెందిన సర్పంచులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, విద్యుత్, వ్యవసాయం, గ్రామీణ తాగునీటి సరఫరా, విద్య, స్వయం సహాయక సంఘాల శాఖల అధికారులు హాజరయ్యారు. గ్రామాల్లో అమలవుతున్న పథకాల పురోగతి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు మరియు వాటి పరిష్కార మార్గాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలను గ్రామ స్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని, ప్రతి అర్హుడికి పథకాల లబ్ధి అందేలా కృషి చేయాలని సూచించారు. గ్రామాల్లో తాగునీరు, రహదారులు, విద్యుత్, వ్యవసాయ సమస్యలను వెంటనే గుర్తించి సంబంధిత శాఖల సమన్వయంతో త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుపేద కుటుంబాలకు మేలు చేకూరేలా ఈ కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి చేరవేయాలని, అధికారులు మరియు ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా పనిచేసి అభివృద్ధిని వేగవంతం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో మండల స్థాయి అధికారులు, వివిధ గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News