Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఏబీవీపీ ఆధ్వర్యంలో చౌటుప్పల్‌లో విద్యాసంస్థల బంద్ సక్సెస్! కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 24, 2026 08:29 AM

కక్కిరేణి పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవం

కక్కిరేణి పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవం

కక్కిరేణి పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవం
February 28, 2026 04:45 PM 114 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట, ఫిబ్రవరి 28: మండలంలోని కక్కిరేణి గ్రామ ప్రాథమిక పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవాన్ని విద్యార్థులు వినూత్నంగా నిర్వహించారు. వివిధ ప్రభుత్వ హోదాల్లో విద్యార్థులు బాధ్యతలు చేపట్టి నిర్వహించిన కార్యక్రమం గ్రామ ప్రజలను ఆకట్టుకుంది.

ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. ఉపేందర్ జి మాట్లాడుతూ విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, పరిపాలనా అవగాహన పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని తెలిపారు.

అంకిరెడ్డి జశ్విక విద్యాశాఖ మంత్రిగా, కన్నెబోయిన లిఖిత ముఖ్య కార్యదర్శిగా, చిల్లా యోగిత కలెక్టరుగా, చిల్లా రాకేష్ ఎమ్మెల్యేగా, నడిగోటి తనుస్వి జిల్లా విద్యాధికారిగా, రియన్ ఎంఈఓగా, శుష్మ ఎంఆర్ఓగా, మైథిలి ఎంపీడీఓగా, బుర్ర అక్షిత హెచ్ఎంగా వ్యవహరించారు.

విద్యార్థులు గ్రామంలో ర్యాలీ నిర్వహించి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. గ్రామ పంచాయతీ పరిధిలో ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించి అనంతరం పాఠశాలలో తరగతులను సందర్శించారు. విద్యార్థుల పనితీరును గ్రామస్థులు అభినందించారు.

కార్యక్రమంలో ఉపాధ్యాయులు జి. గణేష్, పి. గోపాల్ రెడ్డి, కృష్ణ, స్వర్ణలత, ప్రశాంతి పాల్గొన్నారు. ఎస్ఎంసి చైర్మన్ చిల్లా హేమలత మురళీకృష్ణ, పిట్ట రాం రెడ్డి, వేముల సైదులు, చిల్లా భవాని, మధు, కావ్య వెంకట్, కమలాకర్, ప్రమీల, సంధ్య, ధనమ్మ, సుభద్ర తదితరులు హాజరయ్యారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News