Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 01:01 PM

కాంగ్రెస్ పార్టీ విజేత అభ్యర్థులకు ఘన సన్మానించిన:ఖేడ్ ఎమ్మెల్యే

కాంగ్రెస్ పార్టీ విజేత అభ్యర్థులకు ఘన సన్మానించిన:ఖేడ్ ఎమ్మెల్యే

కాంగ్రెస్ పార్టీ విజేత అభ్యర్థులకు ఘన సన్మానించిన:ఖేడ్ ఎమ్మెల్యే
February 13, 2026 07:29 PM 57 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలో నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలోని ఎమ్మెల్యే స్వగృహంలో శుక్రవారం నారాయణఖేడ్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున విజయం సాధించిన అభ్యర్థులను నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి మరియు రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా విజేతలకు శాలువాలు కప్పి,పూలమాలలు వేసి అభినందనలు తెలిపారు.ఈ ఎన్నికల్లో మొత్తం 15 స్థానాలకు గాను 11 స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం ద్వారా నారాయణఖేడ్ పట్టణంలో మరోసారి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బలమైన మద్దతు ఇచ్చినట్లు స్పష్టమైంది. ప్రజలు చూపిన విశ్వాసం, అభిమానానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ,ఈ విజయం ప్రజల విజయం అని తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందిన అభ్యర్థులు:

2వ వార్డు – సురేఖ విట్టల్

4వ వార్డు – దారం శంకర్ సెట్

5వ వార్డు – మహేష్ చౌహాన్

6వ వార్డు – భగవాన్ లక్ష్మణ్

8వ వార్డు – నగేష్ కుమార్ షేట్కార్

9వ వార్డు – బాణాపురం రాజు

10వ వార్డు – ఫర్హానా బేగం

11వ వార్డు – రుక్మిణి గోపాల్ రెడ్డి

12వ వార్డు – షారుఖాన్

13వ వార్డు – మహేందర్కార్ వివేకానంద

14వ వార్డు – అజియా తరుణ్నం

ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు కాంగ్రెస్ పార్టీపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని, నారాయణఖేడ్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. మౌలిక వసతులు,తాగునీరు, రహదారులు,పారిశుధ్యం,విద్య, వైద్యం వంటి రంగాల్లో ప్రత్యేక దృష్టి సారించి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు.పట్టణ అభివృద్ధి కోసం ప్రతి వార్డులో ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని, ప్రజలతో నిత్యం అనుసంధానంగా ఉండి సేవ చేయడం తమ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. ఈ విజయం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు చేసిన కష్టానికి ఫలితమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని విజేత అభ్యర్థులను అభినందించారు.నారాయణఖేడ్ అభివృద్ధికి ఇదే ఆరంభమని,ప్రజల ఆశలకు తగ్గ విధంగా పని చేస్తామని స్పష్టం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News