Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హమాలి కార్మికుల శ్రమ దోపిడీపై ఆగ్రహం సిఐటియు పత్తికుంటపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 25, 2026 07:05 AM

కడప జిల్లాలో ఇద్దరు ఎంఈవోలు సస్పెండ్

కడప జిల్లాలో ఇద్దరు ఎంఈవోలు సస్పెండ్

కడప జిల్లాలో ఇద్దరు ఎంఈవోలు సస్పెండ్
February 28, 2026 02:38 PM 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

కడప: జిల్లాలో విద్యాశాఖలో నిర్లక్ష్యానికి పాల్పడిన ఇద్దరు మండల విద్యాశాఖ అధికారులపై చర్యలు తీసుకున్నారు. ముద్దనూరు ఎంఈవో-1 అన్నయ్య, కొండాపురం ఎంఈవో-1 ఓబులేశును సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ముద్దనూరు మండలం చింతకుంట ఎంపీపీ పాఠశాలలో గతంలో విధులు నిర్వహించిన ఓ ఉపాధ్యాయుడు పాఠశాలకు గైర్హాజరైనప్పటికీ, సంబంధిత ఎంఈవోలు ఆయనకు జీతాలు మంజూరు చేసినట్లు విచారణలో బయటపడింది.

ఈ వ్యవహారంపై అందిన ఫిర్యాదుల మేరకు ఉన్నతాధికారులు విచారణ చేపట్టగా, అక్రమాలు జరిగినట్టు తేలింది. దీంతో బాధ్యులైన ఇద్దరు ఎంఈవోలపై సస్పెన్షన్ వేటు వేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

ఈ ఘటన జిల్లాలో విద్యాశాఖలో చర్చనీయాంశంగా మారింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News