PRINT TIME: February 28, 2026 05:08 PM
కడప జిల్లాలో ఇద్దరు ఎంఈవోలు సస్పెండ్
కడప జిల్లాలో ఇద్దరు ఎంఈవోలు సస్పెండ్
February 28, 2026 02:38 PM
14 Views
స్థానికం ప్రతినిధి :
ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY
కడప: జిల్లాలో విద్యాశాఖలో నిర్లక్ష్యానికి పాల్పడిన ఇద్దరు మండల విద్యాశాఖ అధికారులపై చర్యలు తీసుకున్నారు. ముద్దనూరు ఎంఈవో-1 అన్నయ్య, కొండాపురం ఎంఈవో-1 ఓబులేశును సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ముద్దనూరు మండలం చింతకుంట ఎంపీపీ పాఠశాలలో గతంలో విధులు నిర్వహించిన ఓ ఉపాధ్యాయుడు పాఠశాలకు గైర్హాజరైనప్పటికీ, సంబంధిత ఎంఈవోలు ఆయనకు జీతాలు మంజూరు చేసినట్లు విచారణలో బయటపడింది.
ఈ వ్యవహారంపై అందిన ఫిర్యాదుల మేరకు ఉన్నతాధికారులు విచారణ చేపట్టగా, అక్రమాలు జరిగినట్టు తేలింది. దీంతో బాధ్యులైన ఇద్దరు ఎంఈవోలపై సస్పెన్షన్ వేటు వేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
ఈ ఘటన జిల్లాలో విద్యాశాఖలో చర్చనీయాంశంగా మారింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి