Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 28, 2026 05:08 PM

కడప జిల్లాలో ఇద్దరు ఎంఈవోలు సస్పెండ్

కడప జిల్లాలో ఇద్దరు ఎంఈవోలు సస్పెండ్

కడప జిల్లాలో ఇద్దరు ఎంఈవోలు సస్పెండ్
February 28, 2026 02:38 PM 14 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

కడప: జిల్లాలో విద్యాశాఖలో నిర్లక్ష్యానికి పాల్పడిన ఇద్దరు మండల విద్యాశాఖ అధికారులపై చర్యలు తీసుకున్నారు. ముద్దనూరు ఎంఈవో-1 అన్నయ్య, కొండాపురం ఎంఈవో-1 ఓబులేశును సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ముద్దనూరు మండలం చింతకుంట ఎంపీపీ పాఠశాలలో గతంలో విధులు నిర్వహించిన ఓ ఉపాధ్యాయుడు పాఠశాలకు గైర్హాజరైనప్పటికీ, సంబంధిత ఎంఈవోలు ఆయనకు జీతాలు మంజూరు చేసినట్లు విచారణలో బయటపడింది.

ఈ వ్యవహారంపై అందిన ఫిర్యాదుల మేరకు ఉన్నతాధికారులు విచారణ చేపట్టగా, అక్రమాలు జరిగినట్టు తేలింది. దీంతో బాధ్యులైన ఇద్దరు ఎంఈవోలపై సస్పెన్షన్ వేటు వేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

ఈ ఘటన జిల్లాలో విద్యాశాఖలో చర్చనీయాంశంగా మారింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News