Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఏబీవీపీ ఆధ్వర్యంలో చౌటుప్పల్‌లో విద్యాసంస్థల బంద్ సక్సెస్! కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 24, 2026 07:36 AM

కడప జిల్లాలో ఇద్దరు ఎంఈవోలు సస్పెండ్

కడప జిల్లాలో ఇద్దరు ఎంఈవోలు సస్పెండ్

కడప జిల్లాలో ఇద్దరు ఎంఈవోలు సస్పెండ్
February 28, 2026 02:38 PM 38 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

కడప: జిల్లాలో విద్యాశాఖలో నిర్లక్ష్యానికి పాల్పడిన ఇద్దరు మండల విద్యాశాఖ అధికారులపై చర్యలు తీసుకున్నారు. ముద్దనూరు ఎంఈవో-1 అన్నయ్య, కొండాపురం ఎంఈవో-1 ఓబులేశును సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ముద్దనూరు మండలం చింతకుంట ఎంపీపీ పాఠశాలలో గతంలో విధులు నిర్వహించిన ఓ ఉపాధ్యాయుడు పాఠశాలకు గైర్హాజరైనప్పటికీ, సంబంధిత ఎంఈవోలు ఆయనకు జీతాలు మంజూరు చేసినట్లు విచారణలో బయటపడింది.

ఈ వ్యవహారంపై అందిన ఫిర్యాదుల మేరకు ఉన్నతాధికారులు విచారణ చేపట్టగా, అక్రమాలు జరిగినట్టు తేలింది. దీంతో బాధ్యులైన ఇద్దరు ఎంఈవోలపై సస్పెన్షన్ వేటు వేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

ఈ ఘటన జిల్లాలో విద్యాశాఖలో చర్చనీయాంశంగా మారింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News