Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 04:31 AM

కడప జిల్లాలో ఇద్దరు ఎంఈవోలు సస్పెండ్

కడప జిల్లాలో ఇద్దరు ఎంఈవోలు సస్పెండ్

కడప జిల్లాలో ఇద్దరు ఎంఈవోలు సస్పెండ్
28-02-2026 44 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

కడప: జిల్లాలో విద్యాశాఖలో నిర్లక్ష్యానికి పాల్పడిన ఇద్దరు మండల విద్యాశాఖ అధికారులపై చర్యలు తీసుకున్నారు. ముద్దనూరు ఎంఈవో-1 అన్నయ్య, కొండాపురం ఎంఈవో-1 ఓబులేశును సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ముద్దనూరు మండలం చింతకుంట ఎంపీపీ పాఠశాలలో గతంలో విధులు నిర్వహించిన ఓ ఉపాధ్యాయుడు పాఠశాలకు గైర్హాజరైనప్పటికీ, సంబంధిత ఎంఈవోలు ఆయనకు జీతాలు మంజూరు చేసినట్లు విచారణలో బయటపడింది.

ఈ వ్యవహారంపై అందిన ఫిర్యాదుల మేరకు ఉన్నతాధికారులు విచారణ చేపట్టగా, అక్రమాలు జరిగినట్టు తేలింది. దీంతో బాధ్యులైన ఇద్దరు ఎంఈవోలపై సస్పెన్షన్ వేటు వేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

ఈ ఘటన జిల్లాలో విద్యాశాఖలో చర్చనీయాంశంగా మారింది.

Sthanikam

కడప జిల్లాలో ఇద్దరు ఎంఈవోలు సస్పెండ్

Article Image

కడప: జిల్లాలో విద్యాశాఖలో నిర్లక్ష్యానికి పాల్పడిన ఇద్దరు మండల విద్యాశాఖ అధికారులపై చర్యలు తీసుకున్నారు. ముద్దనూరు ఎంఈవో-1 అన్నయ్య, కొండాపురం ఎంఈవో-1 ఓబులేశును సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ముద్దనూరు మండలం చింతకుంట ఎంపీపీ పాఠశాలలో గతంలో విధులు నిర్వహించిన ఓ ఉపాధ్యాయుడు పాఠశాలకు గైర్హాజరైనప్పటికీ, సంబంధిత ఎంఈవోలు ఆయనకు జీతాలు మంజూరు చేసినట్లు విచారణలో బయటపడింది.

ఈ వ్యవహారంపై అందిన ఫిర్యాదుల మేరకు ఉన్నతాధికారులు విచారణ చేపట్టగా, అక్రమాలు జరిగినట్టు తేలింది. దీంతో బాధ్యులైన ఇద్దరు ఎంఈవోలపై సస్పెన్షన్ వేటు వేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

ఈ ఘటన జిల్లాలో విద్యాశాఖలో చర్చనీయాంశంగా మారింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News