PRINT TIME: April 17, 2026 09:15 PM
జోగిపేట సబ్ జైల్లో ట్రాన్సిట్ హోం పనుల పరిశీలన
జోగిపేట సబ్ జైల్లో ట్రాన్సిట్ హోం పనుల పరిశీలన
April 17, 2026 07:24 PM
32 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
సంగారెడ్డి జిల్లా జోగిపేట సబ్ జైల్లో ఏర్పాటు చేస్తున్న ట్రాన్సిట్ హోం (విదేశీయుల కేంద్రం)ను ఐజీ ఎం. శ్రీనివాస్ సందర్శించి నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా పనులు విదేశీయులకు అనుకూలంగా అన్ని వసతులతో కొనసాగుతున్నాయని తెలిపారు. ట్రాన్సిట్ హోంను త్వరలో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, పనులను నాణ్యతతో పాటు సమయానికి పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్శనలో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, డీసీపీ కృష్ణ చైతన్య, డిఎస్పీ సత్తయ్య గౌడ్, ఇన్స్పెక్టర్లు అనిల్ కుమార్, కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి