Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హరీష్ రావును కలిసిన ఉద్యమ నేత ఎస్.కె. చాంద్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పాటు దిశగా కీలక ముందడుగు కలెక్టర్ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతి కార్పొరేట్ స్థాయికి ప్రభుత్వ పాఠశాలలు – ప్రతిభావంతుల సత్కారం డప్పూర్ గ్రామ శివారులో ఘనంగా బీరప్ప స్వామి – కామరాతి దేవి కళ్యాణ మహోత్సవం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 08, 2026 01:24 AM

జాతీయ లోక్ అదాలత్ విజయానికి బ్యాంకు, ఇన్సూరెన్స్ అధికారులతో సమావేశం

జాతీయ లోక్ అదాలత్ విజయానికి బ్యాంకు, ఇన్సూరెన్స్ అధికారులతో సమావేశం

జాతీయ లోక్ అదాలత్ విజయానికి బ్యాంకు, ఇన్సూరెన్స్ అధికారులతో సమావేశం
March 12, 2026 07:56 PM 41 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీన నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ విజయవంతంగా నిర్వహించేందుకు గురువారం సంగారెడ్డి కోర్టు ప్రాంగణంలో బ్యాంకులు, ఇన్సూరెన్స్ సంస్థలు మరియు చిట్ ఫండ్ సంస్థల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జి. భవాని చంద్ర అధ్యక్షత వహించారు. జాతీయ లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించవచ్చిన కేసులపై అధికారులు సమగ్రంగా చర్చించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, బ్యాంకులు, ఇన్సూరెన్స్ సంస్థలు మరియు చిట్ ఫండ్ సంస్థలకు సంబంధించిన అనేక కేసులు కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ఇలాంటి కేసులను పరస్పర రాజీ ద్వారా జాతీయ లోక్ అదాలత్‌లో సులభంగా, వేగంగా పరిష్కరించుకునే అవకాశం ఉందన్నారు. చిన్న చిన్న ఆర్థిక వివాదాల కారణంగా కేసులు నమోదు కావడంతో కక్షిదారులు కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయం మరియు ధనం వృథా చేసుకుంటున్నారని పేర్కొన్నారు.అందువల్ల ఇలాంటి కేసులను ఇరువర్గాలు పరస్పర అవగాహనతో లోక్ అదాలత్ ద్వారా రాజీ చేసుకొని సమస్యలను త్వరితగతిన పరిష్కరించుకోవాలని సూచించారు. లోక్ అదాలత్‌లో కేసులు పరిష్కారమైతే కక్షిదారులకు తక్షణమే న్యాయం లభించడమే కాకుండా, కోర్టు ఖర్చులు మరియు సమయ నష్టం కూడా తగ్గుతుందని తెలిపారు.జాతీయ లోక్ అదాలత్ విజయవంతం కావడానికి బ్యాంకు అధికారులు, ఇన్సూరెన్స్ సంస్థల ప్రతినిధులు మరియు న్యాయవాదులు పూర్తి సహకారం అందించాలని ఆమె కోరారు. ముఖ్యంగా రాజీకి అవకాశం ఉన్న కేసులను ముందుగా గుర్తించి వాటిని లోక్ అదాలత్‌కు తీసుకురావాలని సూచించారు. కేసులు రాజీ ద్వారా పరిష్కరించబడినప్పుడు కక్షిదారులకు తగిన నష్టపరిహారం అందేలా చూడాలని కూడా సూచించారు.ఈ సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. సౌజన్య, లీడ్ బ్యాంక్ మేనేజర్ నర్సింగ్, వివిధ బ్యాంకుల అధికారులు, ఇన్సూరెన్స్ సంస్థల ప్రతినిధులు, ఇన్సూరెన్స్ స్టాండింగ్ న్యాయవాదులు మరియు ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు. జాతీయ లోక్ అదాలత్ ద్వారా ఎక్కువ సంఖ్యలో కేసులు పరిష్కరించేందుకు అందరూ కలిసి పనిచేయాలని నిర్ణయించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News