జనార్ధనవరం గ్రామంలో అభివృద్ధి పనుల ప్రారంభం
జనార్ధనవరం గ్రామంలో అభివృద్ధి పనుల ప్రారంభం
GADDAM JAGANMOHAN REDDY
ఏలూరు జిల్లా చాట్రాయి మండలం జనార్ధనవరం గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధికి కీలక అడుగు పడింది. గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.30 లక్షలు, మెటల్ రోడ్డు పనులకు రూ.20 లక్షలతో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.
ఈ కార్యక్రమాన్ని జనార్ధనవరం గ్రామ టిడిపి అధ్యక్షులు మాదాసు చిన్న పుల్లయ్య ఆధ్వర్యంలో ప్రారంభించారు. కార్యక్రమంలో చాట్రాయి మండల టిడిపి మహిళా అధ్యక్షురాలు మాదాసు చంద్రకళ, నీటి సంఘం అధ్యక్షుడు వంగల సుబ్బారావు, గ్రామ టిడిపి ఉపాధ్యక్షుడు పామర్తి నాగరాజు, గ్రామ టిడిపి కార్యదర్శి బలువురు రత్తయ్య, కాళంగి గోపాలరావు, బూత్ ఇంచార్జ్ కొనకాల చెన్నారావు, చాట్రాయి మండల తెలుగు యువత ఉపాధ్యక్షుడు బొద్దు వెంకటేశ్వరరావు, మాదిరాజు ప్రసాదు, బొరిగొర్ల తిరుపతిరావు, నడిపింటి వెంకటేశ్వరరావు, పులపాక రఘుబాబు తదితరులు పాల్గొన్నారు.
గ్రామ అభివృద్ధికి నిధులు మంజూరు చేయించడంతో పాటు సహాయ సహకారాలు అందించిన రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి కి జనార్ధనవరం గ్రామ ప్రజలు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
గ్రామంలో ఈ అభివృద్ధి పనులు పూర్తయితే రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు ప్రజలకు మరింత సౌకర్యం కలగనుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి