Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 04:54 PM

జన్మదిన సందర్భంగా పదో తరగతి విద్యార్థులకు పరీక్షా సామగ్రి పంపిణీ

జన్మదిన సందర్భంగా పదో తరగతి విద్యార్థులకు పరీక్షా సామగ్రి పంపిణీ

జన్మదిన సందర్భంగా పదో తరగతి విద్యార్థులకు పరీక్షా సామగ్రి పంపిణీ
March 07, 2026 06:00 PM 70 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా రాష్ట్ర వైస్ చైర్మన్ వై పండరి

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నాగల్గిద్ది మండల కేంద్రంలో శనివారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు పరీక్షా సామగ్రి పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.నేషనల్ హ్యూమన్ రైట్స్, సోషల్ జస్టిస్, సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా రాష్ట్ర వైస్ చైర్మన్ వై. పండరి జన్మదిన వేడుకల సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా పదో తరగతి చదువుతున్న 35 మంది విద్యార్థులకు పరీక్షల సమయంలో అవసరమైన పెన్నులు,పెన్సిల్లు,స్కేలు,హాల్ టికెట్ కవర్లు,చాపమార్లు పంపిణీ చేశారు.విద్యార్థులు పరీక్షలను ధైర్యంగా రాయాలని, క్రమశిక్షణతో చదివి మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులకు ప్రోత్సాహాన్ని అందిస్తాయని తెలిపారు.గ్రామీణ ప్రాంతాల్లో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన సహాయం అందించడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.విద్యార్థులు తమ లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకుని కష్టపడి చదివితే మంచి భవిష్యత్తు సాధించవచ్చని చెప్పారు.ఈ సందర్భంగా విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శంకర్, కాశీరాం, విజేందర్ రెడ్డి, మారుతి జ్యోతి, మల్లేశ్వరి మరియు ఉపాధ్యాయుల బృందం పాల్గొన్నారు.కార్యక్రమాన్ని నిర్వహించిన వారికి పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.అలాగే ఈ కార్యక్రమంలో అంబేద్కర్ భవన్ ఇంచార్జ్ భీమా సేన, కేవీపీఎస్ మండల నాయకుడు గణపతి, వార్డ్ సభ్యుడు తుకారం, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు ఉపయోగపడే ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనందంగా ఉందని పాల్గొన్న వారు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News