జమ్మాపురంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
జమ్మాపురంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Sthanikam District Staff Reporter
మహిళా భవన్కు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండల పరిధిలోని జమ్మాపురం గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభించడంతో పాటు నూతనంగా నిర్మించనున్న మహిళా భవన్కు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి తన ప్రాధాన్యమని,మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. మహిళల సాధికారతకు మహిళా భవన్ వేదికగా మారుతుందని, స్వయం సహాయక సంఘాల సమావేశాలు,శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నుర్ధరాజ్ స్వరూప,ఉపసర్పంచ్,వార్డు సభ్యులు, రాష్ట్ర నాయకులు పోత్నాక్ ప్రమోద్ కుమార్,మండల అధ్యక్షుడు కృష్ణ రెడ్డి, తిమ్మాపురం సర్పంచ్ ఎడ్ల వెంకట్ రెడ్డి,కొండల్ రెడ్డి,బెండే శ్రీకాంత్,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో అభివృద్ధి పనులు ప్రారంభం కావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి