Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 11:28 PM

జమ్మాపురంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

జమ్మాపురంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

జమ్మాపురంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
02-03-2026 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

మహిళా భవన్‌కు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండల పరిధిలోని జమ్మాపురం గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభించడంతో పాటు నూతనంగా నిర్మించనున్న మహిళా భవన్‌కు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి తన ప్రాధాన్యమని,మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. మహిళల సాధికారతకు మహిళా భవన్ వేదికగా మారుతుందని, స్వయం సహాయక సంఘాల సమావేశాలు,శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నుర్ధరాజ్ స్వరూప,ఉపసర్పంచ్,వార్డు సభ్యులు, రాష్ట్ర నాయకులు పోత్నాక్ ప్రమోద్ కుమార్,మండల అధ్యక్షుడు కృష్ణ రెడ్డి, తిమ్మాపురం సర్పంచ్ ఎడ్ల వెంకట్ రెడ్డి,కొండల్ రెడ్డి,బెండే శ్రీకాంత్,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో అభివృద్ధి పనులు ప్రారంభం కావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

Sthanikam

జమ్మాపురంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Article Image

మహిళా భవన్‌కు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండల పరిధిలోని జమ్మాపురం గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభించడంతో పాటు నూతనంగా నిర్మించనున్న మహిళా భవన్‌కు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి తన ప్రాధాన్యమని,మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. మహిళల సాధికారతకు మహిళా భవన్ వేదికగా మారుతుందని, స్వయం సహాయక సంఘాల సమావేశాలు,శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నుర్ధరాజ్ స్వరూప,ఉపసర్పంచ్,వార్డు సభ్యులు, రాష్ట్ర నాయకులు పోత్నాక్ ప్రమోద్ కుమార్,మండల అధ్యక్షుడు కృష్ణ రెడ్డి, తిమ్మాపురం సర్పంచ్ ఎడ్ల వెంకట్ రెడ్డి,కొండల్ రెడ్డి,బెండే శ్రీకాంత్,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో అభివృద్ధి పనులు ప్రారంభం కావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News